సూపర్ స్టార్ మహేశ్ బాబుపై ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సదరు దర్శకుడు ఈ వివాదంపై స్పందిస్తూ తన వివరణ ఇచ్చారు. తన తప్పును అంగీకరిస్తూనే, అది కావాలని చేసింది కాదని, కేవలం పని ఒత్తిడిలో జరిగిన పొరపాటు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
Also Read : Harish Shankar : హరీష్ శంకర్ వివాదాస్పద ‘తథాస్తు’ ట్వీట్.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ట్రోలింగ్
హరీష్ శంకర్ ఎక్స్ వేదికగా ‘ సెన్సార్ తర్వాత బోర్డు అధికారులతో సమావేశం, పెదమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మరియు థమన్ స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులతో నిన్నటి రోజంతా చాలా బిజీగా గడిచింది. అదే సమయంలో జర్నలిస్టులు, అభిమానుల మెసేజ్లకు రిప్లై ఇస్తూ.. ఆ హడావుడిలో ఒక ట్వీట్ను పూర్తిగా చదవకుండానే పొరపాటున కోట్ చేశాను. తన టీమ్ అలర్ట్ చేయగానే నిమిషం లోపే ఆ ట్వీట్ను డిలీట్ చేశాను. “మహేశ్ బాబుపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన నటించిన ‘పోకిరి’ సినిమా గురించి గతంలో నేను చేసిన ట్వీట్స్ చూస్తే ఆయనపై నాకున్న ప్రేమ అర్థమవుతుంది. అంతేకాదు, ‘వారణాసి‘ సినిమాతో ఆయన పేరు మీద మరెన్నో రికార్డులు క్రియేట్ అవుతాయని నేను నమ్ముతున్నాను. ఆయనను కానీ, ఆయన అభిమానులను కానీ బాధపెట్టాలనే ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదు” సినిమా మరో 10 రోజుల్లో విడుదల కాబోతున్న తరుణంలో, ఇలాంటి పోస్టులు చేసేంత అవివేకిని కాదు. ఒక సినిమా రికార్డులు సృష్టించాలంటే అందరు హీరోల అభిమానుల మద్దతు అవసరం, అయినప్పటికీ తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని, తన చిత్రాన్ని ఆదరించాలని’ విజ్ఞప్తి చేశారు.