తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చూపించే ప్రభుత్వం అని ఐటీ శాఖా మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేయొద్దని, తెలంగాణకు వచ్చే పెట్టుబడులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు చూసి శైవ గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకుందని తెలిపారు. 18 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయని, లక్ష మందికి తెలంగాణ యువతకు ఉపాధి లభించిందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
‘తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు చూసి శైవ గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకుంది.13 వందల కోట్లతో బయోటెక్ సంస్థ పెట్టుబడులు పెడుతున్నారు. ఐదు సంస్థల్లో 2100 కోట్లు, 5 వేల మందికి ఉపాధి కలగనుంది. సాంకేతిక పరమైన కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం పెట్టుబడి దారులకు సహకారం అందిస్తుంది. 18 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు, లక్ష మందికి తెలంగాణ యువతకు ఉపాధి లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి అడుగు నుంచే విమర్శలు చేస్తున్నారు. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల్లో చూపిస్తున్నాం’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కు తరలింపు!
‘పెట్టుబడులు రావడం లేదు, కంపెనీలు పోతున్నాయి అనే విమర్శలకు ఇది కౌంటర్. తెలంగాణకు వచ్చే పెట్టుబడులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా?. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో యువతకు మరింత ఉపాధి లభించనుంది. తెలంగాణ ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేయొద్దు. పరిశ్రమల వాతావరణాన్ని డిస్ట్రబ్ చేయొద్దు. భవిషత్తులో పెద్ద సంఖ్యలో పెట్టుబడులు తీసుకొస్తాం’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.