Israeli Strikes: శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దాడి.. పది మంది మృతి.. 40 మందికి గాయాలు
- ఆహారం కోసం బారులు తీరిన వారిపై ఇజ్రాయెల్ ట్యాంక్ కాల్పులు.
- 10 మంది పాలస్తీనియన్లు మరణించగా
- 40 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israeli Strikes: గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలో ఆహారం కోసం బారులు తీరిన వారిపై ఇజ్రాయెల్ ట్యాంక్ కాల్పులు జరపడంతో 10 మంది పాలస్తీనియన్లు మరణించగా, 40 మంది గాయపడ్డారు. అంతేకాకుండా, ఇజ్రాయెల్ విమానాలు అల్ అవదా, అల్ అక్సా హాస్పిటల్ కాంప్లెక్స్ లపై కూడా బాంబు దాడి చేశాయి. ఇందులో 22 మంది మరణించారు. అలాగే, గాజాలోని నుసిరత్ శరణార్థి ప్రాంతంలో ఉన్న అల్ ముఫ్తీ స్కూల్ భవనంలో ఆశ్రయం పొందుతున్న వారిపై కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడిలో 19 మంది చనిపోయారు. ఈ దాడుల్లో మృతి చెందిన వారిలో 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఆహార పదార్థాలతో కూడిన ట్రక్కులను ఇజ్రాయెల్ సైన్యం ఆపడం వల్ల గాజాలోని నిరాశ్రయులైన పాలస్తీనియన్లపై కూడా ఆకలి ఛాయలు అలుముకున్నాయి. ఐక్యరాజ్యసమితి, అమెరికా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే ఈ ట్రక్కులను గాజాలోకి అనుమతించాలని ఇజ్రాయెల్ను కోరాయి. ఈ ట్రక్కులు ఈజిప్ట్ నుండి గాజాకు వెళ్తున్నాయి.
Puneet Superstar: రీల్స్ కోసం ఇంత హంగామా అవసరమా..? గేదె మూత్రం, పేడతో ఏకంగా..(వీడియో)
Also Read
ఉత్తర లెబనాన్లోని క్రైస్తవులు అధికంగా ఉండే పట్టణంలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 18 మంది మరణించారు. తమ దాడిలో సీనియర్ హిజ్బుల్లా కమాండర్ మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. కాగా, దక్షిణ లెబనాన్ లోని మరో 25 గ్రామాలను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైన్యం సాధారణ ప్రజలకు సందేశం ఇచ్చింది. ఇజ్రాయెల్ లోని బిన్యామినా నగరంలో సైనిక స్థావరంపై ఆదివారం రాత్రి హిజ్బుల్లా డ్రోన్ దాడిలో నలుగురు సైనికులు మరణించారు. దాడిలో గాయపడిన దాదాపు 60 మంది సైనికుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వైమానిక రక్షణను మోహరించినప్పటికీ హిజ్బుల్లా డ్రోన్ దాడి విజయవంతం కావడంపై ఇజ్రాయెల్ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. ఆపై దర్యాప్తు ప్రారంభించింది. ఇజ్రాయెల్ ఆర్మీకి చెందిన ఎలైట్ గోలానీ బ్రిగేడ్ను లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్లా ఈ దాడికి పాల్పడింది.
T20 World Cup 2024: భారత్ సెమీస్ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయిందిగా!
తాజావార్తలు
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!