The farmer died : రైలు వేగానికి ఎగిరిపడి రైతు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A farmer died due to over speeding of the train: మరణం అనేది రాసిపెట్టి ఉంటె మర్రి చెట్టు తొర్రలో దాక్కున్నా తప్పించుకోలేరు అంటారు పెద్దలు. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఆడుతూ పాడుతూ ఆ క్షణం వరకు మన ముందు తిరిగిన మనుషులు కూడా మరు నిమిషంలో చనిపోయిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఘటనే ఒకటి విజయనగరంలో చోటు చేసుకుంది. ఎప్పటిలానే పొలానికి వెళ్తున్న ఆ రైతుకు మృత్యువు రైలు రూపంలో ఎదురైనది . వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లోని పాతపెంట గ్రామానికి చెందిన గుల్ల తిరపతి అనే వ్యక్తి రైలు పట్టాల పక్కన ఉన్న తన పొలానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ రైలు పట్టాల మీదకు వచ్చింది. అయితే రైలు వెతున్న వేగానికి వీచిన గాలికి ఆ రైతు ఎగిరి దూరంగా పడ్డాడు.
Read also:plane crash : ప్రమాదానికి గురైన విమానం.. నలుగురు మృతి
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
దీనితో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న చందాన కార్తీక్ అనే గ్రామస్తుడు ఆ రైతు పడిపోవడం గమనించాడు. వెంటనే రైతు కుమారునికి ఈ సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న రైతు కుమారుడు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని కార్తీక్ సహాయంతో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కాగా అప్పటికే ఆ రైతు మృతి చెందారని వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా మరణించిన రైతుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. రైతు మరణంతో స్థానికంగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!