The farmer died : రైలు వేగానికి ఎగిరిపడి రైతు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A farmer died due to over speeding of the train: మరణం అనేది రాసిపెట్టి ఉంటె మర్రి చెట్టు తొర్రలో దాక్కున్నా తప్పించుకోలేరు అంటారు పెద్దలు. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఆడుతూ పాడుతూ ఆ క్షణం వరకు మన ముందు తిరిగిన మనుషులు కూడా మరు నిమిషంలో చనిపోయిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఘటనే ఒకటి విజయనగరంలో చోటు చేసుకుంది. ఎప్పటిలానే పొలానికి వెళ్తున్న ఆ రైతుకు మృత్యువు రైలు రూపంలో ఎదురైనది . వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లోని పాతపెంట గ్రామానికి చెందిన గుల్ల తిరపతి అనే వ్యక్తి రైలు పట్టాల పక్కన ఉన్న తన పొలానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ రైలు పట్టాల మీదకు వచ్చింది. అయితే రైలు వెతున్న వేగానికి వీచిన గాలికి ఆ రైతు ఎగిరి దూరంగా పడ్డాడు.
Read also:plane crash : ప్రమాదానికి గురైన విమానం.. నలుగురు మృతి
Also Read
దీనితో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న చందాన కార్తీక్ అనే గ్రామస్తుడు ఆ రైతు పడిపోవడం గమనించాడు. వెంటనే రైతు కుమారునికి ఈ సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న రైతు కుమారుడు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని కార్తీక్ సహాయంతో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కాగా అప్పటికే ఆ రైతు మృతి చెందారని వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా మరణించిన రైతుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. రైతు మరణంతో స్థానికంగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..