Israel Attack : ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం రఫా నగరం ఉత్తర భాగంలో వలస వచ్చిన పాలస్తీనియన్ల కోసం నిర్మించిన శిబిరాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో కనీసం 25 మంది మరణించారు.. మరో 50 మంది వరకు గాయపడ్డారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, అత్యవసర కార్మికులు ఈ సమాచారాన్ని అందించారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరాటంలో లక్షలాది మంది ప్రజలు వలస వెల్లిన చిన్న పాలస్తీనా భూభాగంలో జరిగిన ఘోరమైన దాడి ఇది. ఈ దాడుల్లో మరణించిన, గాయపడిన వారి సంఖ్య గురించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక సమాచారం ఇచ్చింది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడి విషయం గురించి సమీక్షిస్తామని, అయితే ఐడీఎఫ్ దాడికి పాల్పడినట్లు ఎటువంటి సూచనలు లేవు. ఇతర దాడుల గురించి కూడా వివరాలు ఏం తెలియవని మంత్రిత్వశాఖ పేర్కొంది.
Read Also:Indian 2 : కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ట్రైలర్ వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..?
ఇటీవలి నెలల్లో భారీ శిబిరాలతో నిండిన మధ్యధరా తీరంలోని గ్రామీణ ప్రాంతమైన మువాసిలోని మానవతా జోన్ చుట్టూ ఉన్న ప్రదేశాలపై ఇజ్రాయెల్ గతంలో బాంబు దాడి చేసింది. రెడ్క్రాస్ ఫీల్డ్ హాస్పిటల్ సమీపంలో జరిగిన బాంబు దాడిలో సాక్షులు అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపాయని పేర్కొన్నారు. వారు గుడారాల నుండి బయటకు వచ్చిన ప్రజలను చంపారు. తగిన ఆహారం, నీరు లేదా వైద్య సామాగ్రి లేకుండా ప్రజలు గుడారాలు, ఇరుకైన అపార్ట్మెంట్లలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం గాజాలో ఏ ప్రదేశం సురక్షితంగా లేదని.. మానవతా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇజ్రాయెల్.. హమాస్ యోధులను, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఐక్యరాజ్యసమితి భావించింది.
Read Also:Mancherial: మంచిర్యాలలో విచిత్ర ఘటన.. చనిపోయిన నాలుగేళ్ల తర్వాత కాల్ లెటర్..
ఇప్పుడు హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి తొమ్మిది నెలలు అవుతుంది. గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం పై అంతర్జాతీయంగా విమర్శలు పెరుగుతున్నాయి. గాజాలో మారణహోమం జరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ భూదాడులు, బాంబు దాడుల వల్ల గాజాలో 37,100 మందికి పైగా మరణించారు. అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించింది. ఇందులో దక్షిణ ఇజ్రాయెల్లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో సుమారు 1,200 మంది మరణించారు.. 250 మంది కిడ్నాప్ అయ్యారు.