Mayawati: మాయావతి పొత్తు కోసం ఆలోచిస్తున్నారా? విపక్షాల ఐక్యతపై బీఎస్పీ దృష్టి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayawati: పొత్తుపై మాయావతి ఆలోచన చేస్తున్నారా..? ప్రతిపక్ష ఐక్యతపై బీఎస్పీ కన్ను పడిందా?. బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 23న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీఎస్పీకి చోటు దక్కలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా అడుగులు వేయాలనుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం బీఎస్పీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారా విపక్షాల ఐక్యతపై బీఎస్పీ కన్నేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎస్పీ అధినేత్రి మాయావతి 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి మాయావతి బీఎస్పీ నేతలకు టాస్క్ కూడా ఇచ్చారు. బీఎస్పీ విడుదల చేసిన ప్రెస్ నోట్లో, బీజేపీ కార్యకలాపాలు మారిన రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవటానికి నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Ntr : మరొక యాడ్ లో కనిపించబోతున్న ఎన్టీఆర్..!!
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
మరోవైపు మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఐక్యతలో బీఎస్పీ భాగం కాదని తెలిపారు. మమతా బెనర్జీ, కేసీఆర్, నితీష్ కుమార్ ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రచారం చేస్తున్నారని.. కానీ తనను ఏ నాయకుడూ సంప్రదించలేదని అన్నారు. అటు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని మాయావతి ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. గత కొద్ది రోజులుగా మాయావతి నేరుగా బీజేపీపై విరుచుకుపడుతుండగా.., గతంలో కాంగ్రెస్, బీజేపీలు మాయవతిని ఇరుకున పెట్టాయి. మరోవైపు మాయవతి కాంగ్రెస్పై నేరుగా విమర్శలు చేయలేదు. అయితే మాయావతి పొత్తుకు సిద్ధమవుతున్నారనడానికి ఇదొక ఉదాహరణ. ఆమె తమ పార్టీ నాయకులు మరియు ఎంపీలను కూడా 2024 ఎన్నికల్లో పొత్తుతోనే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడం వల్ల రాజకీయంగా లాభం ఉండదని.. అయితే నష్టపోయే అవకాశం ఉందని బీఎస్పీ నేతలకు తెలుసు. అటువంటి పరిస్థితిలో, మాయావతి పొత్తుకు సంబంధించి తన రాజకీయ లాభనష్టాలను కూడా అంచనా వేస్తున్నారు.
Read Also: Mega Princess: మెగా ప్రిన్సెస్ ఫోటోలు లీక్.. మెగా ఫ్యామిలీ సంచలన నిర్ణయం?
బీఎస్పీ 2014లో పోటీ చేయగా ఖాతా తెరవలేదు. అటు 2022లో ఒక సీటుతో ఎన్నికల బరిలోకి దిగగా.. అది కూడా గెలువలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 2019లో ఎస్పీతో పొత్తు పెట్టుకుని బీఎస్పీ 10 లోక్సభ స్థానాలను గెలుచుకోగలిగింది. మరోవైపు యూపీలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ విపక్షాల ఐక్యతకు ఇరుసుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందులో విజయం సాధిస్తే మాయావతి ఒంటరి కావడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు జరిగితే బీఎస్పీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగలవచ్చని, అందుకే కూటమి, విపక్షాల ఐక్యతపై నిఘా పెట్టాలని మాయావతి మాట్లాడుతున్నారని భావిస్తున్నారు.
- Tags
- Alliance
- bjp
- BSP
- Mayawati
- opposition
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!