ICC World Cup 2023: పాకిస్థాన్ వరల్డ్ కప్ ఆడేది అనుమానమే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023ను టోర్నమెంట్ ను పాకిస్థాన్ జట్టు బహిష్కరించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీమిండియా ఆసియా కప్ ను పాక్ లో ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. వరల్డ్ కప్ లో పాక్ టీమ్ భారత్ లో ఎందుకు ఆడాలనే ప్రశ్న తలెత్తనుంది. అయితే, పాక్ ప్రభుత్వంతో జరుగుతున్న పరిణామాలను భట్టి చూస్తుంటే వరల్డ్ కప్ ఆడేది అనుమానంగానే ఉంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు దాయాది జట్టును పంపించడంపై నిర్ణయం తీసుకునేందుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
Read Also: Jeevan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లోనే మోడీ నడుస్తున్నారు
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ఇదే టైంలో ఆసియా కప్లో ఆడేందుకు పాకిస్థాన్ కు వెళ్లడం లేదని భారత్ తెలిపింది. టీమిండియా ఆసియా కప్ కోసం పాక్కు వచ్చేందుకు ఇష్టపడనప్పుడు వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆడే మ్యాచ్లను తటస్థ వేదికల్లో ఎందుకు నిర్వహించకూడదు..? అని ఆ దేశ క్రీడాశాఖ మంత్రి ఎహ్సాన్ మజారీ ప్రశ్నించారు. మరోవైపు ఆసియా కప్కు సంబంధించి హైబ్రిడ్ మోడల్ను ధృవీకరించడానికి ఐసీసీ బోర్డు రేపు (గురువారం) సమావేశం నిర్వహించనుంది. ఈ తరుణంలో బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) కార్యదర్శి జై షా, పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చీఫ్ జకా అష్రఫ్ డర్బన్లో సమావేశం కానున్నారు.
Read Also: Shah Rukh Khan : నయనతార భర్తకు షారుఖ్ ఖాన్ వార్నింగ్.. విక్కీ షాకింగ్ రిప్లై
పాక్లో ఆడేందుకు భారత్ ఓప్పుకోకపోవడంతో ఆసియా కప్కు హైబ్రిడ్ మోడల్ను మాజీ పీసీబీ చీఫ్ నజామ్ సేథీ ప్రకటించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆమోదించిన ఆ మోడల్ ప్రకారం పాకిస్తాన్లో నాలుగు లీగ్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఆ తర్వాత శ్రీలంకలో 9 మ్యాచ్లు నిర్వహించనున్నారు. అందులో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది. ఒకవేళ రెండు జట్లు ఫైనల్కు వెళ్తే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరుగనుంది. ఈ హైబ్రిడ్ మోడల్ను ప్రస్తుత పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ వ్యతిరేకించారు.
Read Also: Tamannaah Bhatia: తమన్నా స్కిన్ షో.. ఎట్టకేలకు లక్కీ ఛాన్స్ పట్టేసిందన్నమాట..?
అయితే.. ఈ మోడల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే ఆమోదించడంతో షెడ్యూల్లో మార్పులు ఉండబోవని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కాగా.. ప్రపంచ కప్లో పాకిస్థాన్ జట్టు ఆడే వేదికలను పరిశీలించేందుకు భారత్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ బృందాన్ని పంపిస్తోంది. దీన్ని బట్టి పాక్ జట్టును భారత్కు పంపడానికి పాకిస్థాన్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!