Arunachal Pradesh Trip: అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాలనుకుంటున్నారా?..ఐఆర్సీటీసీ ప్యాకేజీ ట్రై చేయండి
- అత్యంత అందమైన రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ ఒకటి
- ఇక్కడ భారత్ కు చెందిన కొన్ని ప్రముఖ హిల్ స్టేషన్లు
- అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ
- ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ ప్రదేశ్ భారత ఉపఖండంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో ఒకటి. భారతదేశంలోని కొన్ని ప్రముఖ హిల్ స్టేషన్లు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అరుణాచల్ యొక్క ప్రధాన శిఖరం కాంగ్టో. ఈ శిఖరం సగటు సముద్ర మట్టానికి 7,060 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆహ్లదకరమైన వాతావరణాన్ని అనుభవించడానికి దాదాపు ఏడాది పొడవునా పర్యటకులు అరుణాచల్ ప్రదేశ్కు వస్తుంటారు. తాజాగా ఈ అందమైన ప్రదేశాన్ని వీక్షించేందుకు ఐఆర్సీటీసీ ఓ సువర్ణావకాశాన్ని అందించింది. అరుణాచలం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ..ఐఆర్సీటీసీ ట్వీట్ చేసింది.
READ MORE: Hyderabad: రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు మృతి
Also Read
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు…
ప్యాకేజీ పేరు- అరుణాచల్ ఎక్స్పెడిషన్ బై రైల్ ఎక్స్-ఎన్జెపి
ప్యాకేజీ వ్యవధి- 7 రాత్రులు, 8 రోజులు
ప్రయాణ విధానం- రైలు, రోడ్డు
ప్రాంతాలు- గౌహతి, తేజ్పూర్, కాజిరంగా, దిరాంగ్, తవాంగ్
READ MORE:Couple Suicide: ‘పిల్లలను బాగా చూసుకోలేకపోయాం..’ సూసైడ్ నోట్ రాసి దంపతులు ఆత్మహత్య
మీకు ఈ సౌకర్యం లభిస్తుంది..
1. ప్రయాణానికి రైలు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
2. బస చేయడానికి హోటల్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
3. ఈ టూర్ ప్యాకేజీలో అల్పాహారం,రాత్రి భోజనం అందుబాటులో ఉంటుంది.
4. మీరు ప్రయాణ బీమా సౌకర్యం కూడా పొందుతారు.
5. ఈ ట్రిప్లో మీరు ఒంటరిగా ప్రయాణించినట్లయితే.. రూ. 48,280 చెల్లించాలి.
6 . ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరికి రూ.36,740 చెల్లించాల్సి ఉంటుంది.
7. ముగ్గురైతే ఒక్కొక్కరికి రూ.34,310 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
8. పిల్లలకు ప్రత్యేక ఫీజు ఉంది. బెడ్తో కలిపి (5-11 ఏళ్లు) రూ.29,060 చెల్లించాల్సి ఉంటుంది.
READ MORE:Ayodhya Rape Case: 12 ఏళ్ల బాలిక కడుపులో 12 వారాల పాప..నిందితుడి ఇంటికి బుల్డోజర్!
ఎలా బుక్ చేయాలి..
ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీ కోసం బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, ఐఆర్సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
తాజావార్తలు
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!