Ayodhya Rape Case: 12 ఏళ్ల బాలిక కడుపులో 12 వారాల పాప..నిందితుడి ఇంటికి బుల్డోజర్!
- ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం
- బేకరీలో దినసరి కూలీగా పని చేస్తున్న బాలిక
- ఆ బాలికపై బేకరీ యజమాని..మరో వ్యక్తి గత రెండు నెలలుగా అత్యాచారం
- నిందితుడు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన సంచలనం సృష్టించింది. తన బేకరీలో దినసరి కూలీగా పని చేస్తున్న ఆ బాలికపై బేకరీ యజమాని, మరో వ్యక్తి గత రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు. ఈ కేసులో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) కార్యకర్త మోయిద్ ఖాన్తో పాటు రాజు ఖాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
READ MORE: Hyderabad: ఘోర ప్రమాదం.. కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
అయోధ్య జిల్లాకు చెందిన 12 ఏళ్ల అత్యాచార బాధితురాలి తల్లికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. లక్నోలోని ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసిన బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపింది. తాజాగా నిందితుడి ఇంటికి సీఎం యోగీ ఇంటికి బుల్డోజర్ పంపారు. ఇళ్లు నేలమట్టమైంది.
READ MORE:Hyderabad: అబిడ్స్లో అగ్నిప్రమాదం..
అత్యాచారం వేదనకు గురవుతున్న బాలిక మరెన్నో వేదనలను ఎదుర్కొంటోంది. 12 సంవత్సరాల వయస్సులో, ఆమె కడుపులో 12 వారాల పిండం పెరుగుతోంది. డెలివరీ లేదా అబార్షన్ రెండూ బాలికకు ప్రమాదమే. ఇప్పుడు వైద్యులు కూడా బాలిక ప్రాణాలను రక్షించే మార్గాలను అన్వేషిస్తున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కుటుంబ సభ్యుల సమ్మతి కోసం వేచి ఉన్నారు. బిడ్డకు ఇంకా ప్రసవ వయస్సు లేదు.. గర్భస్రావం 24 వారాల వరకు జరుగుతుంది. సాధారణ ప్రసవం ద్వారా పిండాన్ని తొలగించే ప్రయత్నం చేస్తామని జిల్లా మహిళా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశారాం తెలిపారు.
ఈ ఘటన తర్వాత ఎస్పీ నేత మొయీద్ఖాన్ ఇంటికి బుల్డోజర్ చేరుకోనుంది. 630 చదరపు మీటర్ల శ్మశాన వాటిక భూమిని ఆక్రమించి మొయీద్ ఇల్లు కట్టుకున్నట్లు రెవెన్యూశాఖ విచారణలో తేలింది. అదేవిధంగా చెరువు భూమిలో, పబ్లిక్ రోడ్డులో నిర్మించిన రెండంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ కూడా కూల్చివేయనున్నారు. రెవెన్యూ శాఖ విచారణ నివేదికను డీఎం చంద్ర విజయ్ సింగ్కు అందజేస్తామని సోహవాల్ డిప్యూటీ జిల్లా మేజిస్ట్రేట్ అశోక్ సైనీ తెలిపారు. అనంతరం అతడి ఇంటికి బుల్డోజర్ చేరుకుంటుంది.
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!