Couple Suicide: ‘పిల్లలను బాగా చూసుకోలేకపోయాం..’ సూసైడ్ నోట్ రాసి దంపతులు ఆత్మహత్య
- ప్రాణాలతో ఉండి మా పిల్లలను బాగా చూసుకోలేకపోయాం..
- దగ్గరివారు ఎవరైనా మా పిల్లలను బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను..
- ఇద్దరం మా ఇష్ట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్నాం..
- ' ఓ హోటల్లో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ప్రాణాలతో ఉండి మా పిల్లలను బాగా చూసుకోలేకపోయాం… దగ్గరివారు ఎవరైనా మా పిల్లలను బాగా చూసుకుంటారని ఆశిస్తున్నాను.. ఇద్దరం మా ఇష్ట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్నాం…’ అని ఓ హోటల్లో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రయాగ్రాజ్లో చోటు చేసుకుంది. ఈ ఆత్మహత్య ఘటనపై పోలీసులు వారి కుటుంబాలకు సమాచారం అందించారు. కరేలిలో నివాసముంటున్న మహమూద్ ఆలం (44) తన పిల్లలతో కలిసి రాజాజీపురంలోని ఓ ఇంట్లో ఏడేళ్లుగా నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి హోటల్ రాజ్వీర్లోని రూం నంబర్ 302లో భార్య జెబా అన్సారీ (39)తో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోటల్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా గది తలుపులు తెరవకపోవడంతో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: Hyderabad: ఘోర ప్రమాదం.. కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి
Also Read
- నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
- Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
- CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
దీంతో వెంటనే అక్కడకి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. అలాగే వారు రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్లు రాశారు. దీంతో.. ఆ నెంబర్లకు ఫోన్ చేసి సంఘటన గురించి మృతుల కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కాగా.. మృతదేహాలకు ఈరోజు పోస్టుమార్టం నిర్వహించారు.
Read Also: Dharavi: మురికివాడకు మంచిరోజులు..!ఊపందుకున్న ధారవి పునరాభివృద్ధి ప్రాజెక్టు
మహమూద్ ఆలం కంప్యూటర్ హార్డ్వేర్ నిర్వహిస్తుండేవాడు. అయితే.. తాను చేసే పనిలో నష్టం రావడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. సూసైడ్ నోట్లో కూడా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు రాశాడు. మృతుడు మహమూద్కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆ పిల్లలను ప్రస్తుతం తన బావ సాజిద్ పెంచి పోషిస్తున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి.. శుక్రవారం సాయంత్రం 4:22 గంటలకు మహమూద్ ఆలం హోటల్ గదిని బుక్ చేశాడు. అదే రోజు తమ పిల్లల వద్దకు వెళ్లి తాము ఒక పార్టీకి వెళ్తున్నట్లు చెప్పారు. మళ్లీ శనివారం వస్తామని చెప్పి వెళ్లినట్లు పిల్లలు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
Assam Murder Case: ఫ్రిజ్లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్కు షాక్.. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!