Iran Blast : ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ పేలుడు.. అమెరికాలో ఉద్రిక్తత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Blast : ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ ఏవియేషన్ అండ్ స్పేస్ ఫోర్స్ హెడ్క్వార్టర్స్లో ఇది జరిగింది. పేలుడు అనంతరం ప్రధాన కార్యాలయం నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. భారీ పేలుడు మధ్యప్రాచ్యంలో మరింత సంక్షోభం ఏర్పడుతుందనే భయాలను పెంచింది. గాజా స్ట్రిప్, లెబనాన్ సరిహద్దులో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఈ పేలుడు అమెరికా, ఇరాన్ మధ్య సంఘర్షణను పెంచుతుంది. పేలుడు చాలా శక్తివంతమైనది, ప్రధాన కార్యాలయం నుండి చాలా సేపు మంటలు ఎగసిపడుతున్నాయి. ఏవియేషన్, స్పేస్ ఫోర్స్ ఈ ప్రధాన కార్యాలయం నుండి క్షిపణులు, డ్రోన్లు సరఫరా చేయబడ్డాయి. ఇజ్రాయెల్, అమెరికాపై యుద్ధం చేస్తున్న హమాస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటుదారులకు ఈ ప్రదేశం నుండి మారణాయుధాలు పంపబడుతున్నాయని అనుమానిస్తున్నారు.
Read Also:Hombale Films: ఈ సమయంలో ఈ ట్వీట్ అవసరమా దొర?
Also Read
- Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
- Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
- IND vs AFG T20: వైభవ్తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
అయితే ఈ పేలుడుకు అసలు కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఇది ప్రమాదమా లేదా కుట్ర అనే దానిపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. కానీ గాజా యుద్ధం మధ్య, ఇటువంటి సంఘటనకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్ను ప్రాక్సీ గ్రూపుల గురించి హెచ్చరించాయి. ఇరాన్ నిప్పుతో ఆడుకోవడం మానేయాలని పేర్కొంది. ఉద్రిక్తత మధ్య, ఇరాన్ గ్యాస్ స్టేషన్లపై ఇజ్రాయెల్ హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. ఇరాన్లోని 60 నుంచి 70 శాతం గ్యాస్ స్టేషన్లలో పనులు నిలిచిపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇజ్రాయెల్, అమెరికా హ్యాకర్లు గ్యాస్ స్టేషన్లపై సైబర్ దాడులకు పాల్పడ్డారని ఇరాన్ ఆరోపించింది.
Read Also:Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షానికి షాక్.. కోర్టులో పిటిషన్ తిరస్కరణ
ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ సంఘటన కారణంగా సోమవారం దేశవ్యాప్తంగా 30 శాతం గ్యాస్ స్టేషన్లు మాత్రమే పనిచేశాయి. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ సైబర్ దాడికి ఇజ్రాయెలీ హ్యాకర్స్ గ్రూప్ ‘గొంజెష్కో దరాండే’ని నిందించింది. దేశంలో మొత్తం 33 వేల గ్యాస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో రోజంతా గ్యాస్ స్టేషన్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఈ సమయంలో స్టాక్, సరఫరా డేటాలో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. 2022లో కూడా ఇదే గ్రూప్ ఇజ్రాయెల్ హ్యాకర్లు ఇరాన్కు చెందిన ప్రముఖ స్టీల్ కంపెనీని హ్యాక్ చేశారు. 2000 చివరలో స్టక్స్నెట్ కంప్యూటర్ వైరస్ ఇరాన్ అణు కేంద్రం వద్ద సెంట్రిఫ్యూజ్లకు అంతరాయం కలిగించింది. ఇటీవలి సంవత్సరాలలో ఇరాన్లో అనేక సైబర్ దాడులు జరిగాయి. ఇప్పుడు ఇజ్రాయెల్పై ప్రాక్సీ వార్ చేస్తున్న ఆరోపణల మధ్య, ఇరాన్పై అలాంటి దాడుల భయం పెరిగింది.
తాజావార్తలు
-
Ratan Tata: ఆ రూ.10,000 కోట్ల సంపద.. ఎవరికి దక్కనుంది? రతన్ టాటా ఆస్తి వెనుక ఊహించని ట్విస్ట్!
-
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!