IPL Mega Auction: ఐపీఎల్ వేలంలో 12 మంది ప్రత్యేకం.. పంత్ చరిత్ర సృష్టిస్తాడా?
- సౌదీ అరేబియాలో ఐపీఎల్ 2025 మెగా వేలం
- నవంబర్ 24, 25 తేదీల్లో బిడ్డింగ్
- మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లు
- గరిష్టంగా 204 మంది ఆటగాళ్ల విక్రయం
- ఈ సారి రిషబ్ పంత్ చరిత్ర సృష్టిస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోంది. మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరగనుంది. అయితే, గరిష్టంగా 204 మంది ఆటగాళ్లను మాత్రమే విక్రయిస్తారు. ఐపీఎల్లో ఇది 18వ వేలం కావడం విశేషం. మెగా వేలం ప్రారంభంలోనే మార్క్యూ ఆటగాళ్లను వేలం వేయనున్నారు. ఇందుకోసం బీసీసీఐ 12 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, జోస్ బట్లర్, అర్ష్దీప్ సింగ్, కగిసో రబడ, మిచెల్ స్టార్క్ పేర్లు మార్క్యూ జాబితా మొదటి జాబితాలో ఉన్నారు. రెండో జాబితాలో కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కి చోటు దక్కింది. ఈ 12 మంది ఆటగాళ్లలో 11 మంది ప్రాథమిక ధర రూ.2 కోట్లు. కాగా డేవిడ్ మిల్లర్ బేస్ ధర రూ.1.5 కోట్లు. జోస్ బట్లర్ ను ముందుగా వేలం వేయనున్నారు.
మార్క్యూ జాబితా-1 (M1):
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
జోస్ బట్లర్ (ఇంగ్లండ్)
శ్రేయాస్ అయ్యర్ (భారతదేశం)
రిషబ్ పంత్ (భారతదేశం)
అర్ష్దీప్ సింగ్ (భారతదేశం)
కగిసో రబడ (దక్షిణాఫ్రికా)
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
మార్క్యూ జాబితా-2 (M2):
KL రాహుల్ (భారతదేశం)
యుజ్వేంద్ర చాహల్ (భారతదేశం)
లియామ్ లివింగ్స్టోన్ (ఇంగ్లండ్)
డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా)
మహ్మద్ షమీ (భారతదేశం)
మహ్మద్ సిరాజ్ (భారతదేశం)
పంత్కు చరిత్ర సృష్టించే అవకాశం!
ఈ రెండు రోజుల మెగా వేలంలో అందరి దృష్టి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్పై ఉంది. రూ. 24.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ రికార్డును రిషబ్ బ్రేక్ చేయొచ్చు. రిటెన్షన్స్ తర్వాత అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 641.5 కోట్ల మొత్తం మిగిలుంది. పంజాబ్ కింగ్స్ అత్యధికంగా రూ. 110.50 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 83 కోట్లు. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 73 కోట్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వద్ద కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఉన్నందున ఈ ధరకు అతడిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ప్రతి రెండేళ్లకోసారి జట్టును మార్చుకునే పంజాబ్ కింగ్స్కు అవకాశం వరించనుంది. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ తన అభిమాన ఆటగాడితో మళ్లీ కలవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. వేలంలో 81 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.2 కోట్లు. ప్రస్తుత భారత క్రికెటర్లు ఒక మిలియన్ డాలర్లను (రూ. 8.5 కోట్లు) దాటగలరు. గత మూడు సీజన్లలో 96 టీ20 అంతర్జాతీయ వికెట్లు తీసిన అర్ష్దీప్ సింగ్ కూడా భారీ బిడ్ పొందవచ్చు. ఫాస్ట్ బౌలర్లకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!