Arunachal Pradesh: అంతరాష్ట్ర వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. నలుగురు మైనర్లు సేఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు ఇటీవల అంతర్రాష్ట్ర వ్యభిచార ముఠాను ఛేదించారు. 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల నలుగురు మైనర్ బాలికలను రక్షించారు. ఈ మేరకు ఓ సీనియర్ పోలీసు అధికారి శుక్రవారం వెల్లడించారు. ఇటానగర్ పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ రాజ్బీర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. మైనర్లను పొరుగున ఉన్న అస్సాంలోని ధేమాజీకి చెందిన ఇద్దరు సోదరీమణులు ఇక్కడకు రవాణా చేశారని చెప్పారు. అక్కాచెల్లెళ్లిద్దరూ ఇటానగర్లో బ్యూటీ పార్లర్ నడుపుతున్నట్లు చెప్పాడు. ఇక్కడికి సమీపంలోని చింపులో మైనర్ బాలికల వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసు బృందం మే 4న టెక్కీ రీనా, జామ్లో తగుంగ్ల ఇంటిపై దాడి చేసి ఇద్దరు మైనర్ బాలికలను రక్షించినట్లు ఆయన తెలిపారు.
Read Also: ISRO: 3డీ-ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
Also Read
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
అధికారి ప్రకారం, ఇద్దరు మహిళలు తమ ఇంటి నుంచి వ్యభిచారం నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పుష్పాంజలి మిలి, పూర్ణిమ మిలి అనే ఇద్దరు సోదరీమణులు తమను ధేమాజీ నుంచి ఇటానగర్కు తీసుకువచ్చారని విచారణలో మైనర్ బాలికలు చెప్పారని అధికారి తెలిపారు. ఇటానగర్కు అక్రమంగా తరలించిన తర్వాత తమను బలవంతంగా వ్యభిచారంలోకి దింపారని చెప్పారు.
ఇటానగర్ ఎస్పీ రోహిత్ రాజ్బీర్ సింగ్ మాట్లాడుతూ.. “ఈ విషయం గురించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలియజేయబడింది. వారి ఫిర్యాదు ఆధారంగా, ఇటానగర్ మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. దీనితో పాటు ధేమాజీ నుంచి బాలికలను తీసుకువచ్చారని కూడా తేలింది. మరో ఇద్దరు మైనర్ బాలికలను కూడా రక్షించాం. పుష్పాంజలి మిలి అదుపులో ఉన్నారు. నలుగురు మహిళలను అరెస్టు చేశాం. మైనర్ బాలికలు షెల్టర్ హోమ్లో ఉన్నారు.” అని ఎస్పీ వెల్లడించారు. ముఠాలో ప్రమేయం ఉన్న కనీసం ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారని.. మిగిలిన ఎనిమిది మంది కస్టమర్లు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఉన్నారని ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..