Internet Shutdown: 24 గంటల పాటు ఇంటర్నెట్ బంద్..సోషల్ మీడియా యూజర్లకు హెచ్చరిక..
- రేపు హర్యానా రాష్ట్రంలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర
- గతంలో ఈ యాత్ర సందర్భంగా భారీ ఘర్షణలు
- మరోసారి ఎలాంటి విధ్వంసం చోటుచేసుకోకుండా హర్యానా ప్రభుత్వం చర్యలు
- 24 గంటల పాటు ఇంటర్నెట్.. బల్క్ ఎస్ఎమ్ఎస్ సేవలను నిలుపుదల
- జులై 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు హర్యానా రాష్ట్రంలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర చేపట్టనున్నారు. గతంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటన వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో పోలీసులు కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్ర సమయంలో నుహ్ జిల్లాలో 24 గంటల పాటు ఇంటర్నెట్ మరియు బల్క్ ఎస్ఎమ్ఎస్ సేవలను నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వల ప్రకారం.. నుహ్ జిల్లాలో జులై 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22 సాయంత్రం 6 గంటల వరకు వర్తిస్తుంది. తప్పుడు వదంతులు వ్యాపించి శాంతిభద్రతలకు భంగం కలిగించడం, విధ్వంసకర అంశాలను వ్యాప్తి చేయడానికి ఇంటర్నెట్ సేవలను దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. నూహ్లోని ప్రజా ఆస్తులు మరియు సౌకర్యాలకు నష్టం వాటిల్లకుండా నిరోధించడానికి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు హర్యానా డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత తెలిపారు.
READ MORE: Heavy Floods: ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి.. గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఇది కాకుండా.. మొబైల్ ఇంటర్నెట్ సేవల ద్వారా వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ మొదలైన వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. గతంలో ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయడం ద్వారా హింసాత్మక కార్యకలాపాలు చోటుచేసుకుటున్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల సౌలభ్యం, ప్రాథమిక గృహావసరాల మేరకు వ్యక్తిగత ఎస్ఎమ్ఎస్ , మొబైల్ రీఛార్జ్, బ్యాంకింగ్ ఎస్ఎమ్ఎస్, వాయిస్ కాల్స్, కార్పొరేట్, దేశీయ బ్రాడ్బ్యాండ్, అద్దె లైన్ల ద్వారా అందించే ఇంటర్నెట్ సేవలకు మినహాయింపు ఇచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత తెలిపారు.
READ MORE: TCS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..టీసీఎస్ లో భారీగా ఉద్యోగాలు
యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నూహ్ పోలీసులు తెలిపారు. గత ఏడాది జులై 31న హర్యానాలోని నుహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును పలువురు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందులో ఇద్దరు హోంగార్డులు మృతి చెందగా.. కనీసం 15 మంది గాయపడ్డారు. బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా జనం రాళ్లు రువ్వడంతో పాటు కార్లకు నిప్పు పెట్టారు. అదే రాత్రి.. గురుగ్రామ్లోని ఒక మసీదుపై ఒక గుంపు దాడి చేసింది. ఈ ఘర్షణ తర్వాత అల్లర్లు చెలరేగాయి. దీంతో 5 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రలో మతం పేరుతో కొందరు వికృత చేష్టలు పరస్పర సామరస్యానికి భంగం వాటిల్లకుండా చూసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. అక్రమాస్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఇందుకోసం డ్రోన్ల సాయం కూడా తీసుకోనున్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!