TCS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..టీసీఎస్ లో భారీగా ఉద్యోగాలు
- నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్
- ఈ సంవత్సరం 40 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడి
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉద్యోగ అవకాశాలపై ఎక్కువగా ఉండదని ప్రకటన
- మొదటి త్రైమాసికంలో 5452 మంది ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ సంవత్సరం 40 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచమంతా ఉద్యోగులను వణికిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉద్యోగ అవకాశాలపై ఎక్కువగా ఉండదని ఇటీవల కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5452 మంది ఉద్యోగులను కూడా నియమించినట్లు ప్రకటించింది. దీంతో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి పెరిగినట్లు టీసీఎస్ యాజమాన్యం పేర్కొంది. దీంతోపాటు ఉద్యోగుల వేతనాలను కూడా సవరించింది. ప్రస్తుతం ఉన్న వేతనాలను 4.5 శాతం నుంచి 12 శాతానికి పెంచింది. అలాగే ప్రతి 5 రోజులకోసారి కార్యాలయానికి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా 70 శాతానికి పెరిగినట్లు టిసిఎస్ పేర్కొంది.
READ MORE: Haryana: బ్రజ్ మండల్ యాత్ర.. నుహ్లో ఇంటర్నెట్ బంద్..
Also Read
- Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్... కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
- QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
- Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
ప్రీ-కోవిడ్ స్థాయికి చేరుకుంటున్న ఆఫీసులో ఉద్యోగుల హాజరు..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయాల నుంచి పనిచేసే ఉద్యోగుల శాతం కోవిడ్ మహమ్మారి కంటే ముందు స్థాయికి చేరుకున్నట్లు టాటా గ్రూప్ కంపెనీ హ్యూమన్ రిసోర్స్ విభాగం అధిపతి మిలింద్ లక్కడ్ తెలిపారు. 18 నెలల కృషి అనంతరం ఈ స్థాయిని సాధించగలిగామని వెల్లడించారు. నిజానికి కోవిడ్కు ముందు ఉన్న ఉద్యోగుల హాజరు స్థాయికి దాదాపుగా తిరిగి వస్తున్నామని చెప్పారు. ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీలో 70 శాతం కంటే ఎక్కువ మంది ఆఫీసుకు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!