CM Chandrababu: ప్రత్యేకంగా సీటు వేయాలా?.. కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆసక్తికర సంభాషణ
- కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆసక్తికర సంభాషణ
- సివిల్ సప్లైస్ శాఖ సమీక్ష ప్రారంభించే చంద్రబాబు ఛలోక్తులు
CM Chandrababu: వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. వివిధ సంక్షేమ శాఖలపై ఆయా శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సివిల్ సప్లైస్ శాఖ సమీక్ష ప్రారంభించే ముందు కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆసక్తికర సంభాషణ జరిగింది. చాలా దూరంగా కూర్చున్నావ్.. ప్రత్యేకంగా సీటు వేయాలా..? అంటూ ఆ శాఖ కార్యదర్శి సిద్దార్ధ్ జైన్ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు. నాన్ ఫోకస్లో ఉన్నానని అనుకుంటున్నారా..? అంటూ సీఎం చంద్రబాబు ఛలోక్తి విసిరారు. దగ్గరలో ఛైర్ లేకపోవడం వల్ల దూరంగా కూర్చున్నారంటూ సిద్దార్ధ్ జైన్కు సపోర్టుగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఏం కాదులే.. మీరు మీ శాఖ అధికారిని వెనకేసుకొస్తున్నారంటూ సీఎం చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సంభాషణతో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఆహ్లాదంగా మారింది. అంతకు ముందు భోజన విరామం అనంతరం విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోస్ట్ లంచ్ సమావేశం కాబట్టి వీలైనంత త్వరగా ముగిస్తానని కోన శశిధర్ వెల్లడించగా.. ఎవ్వరికీ నిద్ర రాకుండా ప్రజెంటేషన్ ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో సమావేశంలోని అధికారుల ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి.
Read Also: AP CM Chandrababu: ఏపీ యువతకు ఉద్యోగాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి పెంచాలి..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ నెల ఏడో తేదీన చేనేత దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా చేనేత జౌళి శాఖ కార్యదర్శి సునీత కల్పించుకుని విజయవాడలో నిర్వహించాలని కోరారు. ఈ క్రమంలో మీకు చీరాల రావడానికి ఏమైనా ఇబ్బందా.. అంటూ సీఎం చంద్రబాబు ఆ ఐఏఎస్ అధికారిని అడిగారు. ఈ సందర్భంగా అధికారి సునీత మాట్లాడుతూ.. అదే రోజున కేబినెట్ ఉందని చెప్పారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు స్పందిస్తూ..అయితే చేనేత దినోత్సవాన్ని చీరాలలోనే మధ్యాహ్నం కొనసాగించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తే మంచి ప్రభావం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలో తప్పకుండా చీరాలలో విజయవంతంగా చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఐఏఎస్ అధికారి సునీత ముఖ్యమంత్రికి తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!