Telangana Inter board: హిట్లర్ను మించిపోతున్న ఇంటర్ బోర్డు అధికారులపై జేఏసీ చైర్మన్ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్ బోర్డు అధికారుల దౌష్టికం రోజురోజుకు పెరిగిపోతుంది అని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ విద్య మండలిలో తిష్ట వేసిన అధికారుల యొక్క నిర్ణయాలు ఇంటర్ అధ్యాపకుల పాలిట శాపంగా మారుతున్నాయన్నారు. ఇక, ఇంటర్ బోర్డులో అడ్వాన్స్ సప్లిమెంటరీ స్పాట్ వాల్యూషన్ కి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసే క్రమంలో ఇచ్చినటువంటి నియామక పత్రాల్లో గెస్ట్ అధ్యాపకులను తొలగించాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి బోర్డులో ఉన్నటువంటి నియమాల నిబంధనల పట్ల ఆరు నెలలైనా ఇంకా ఏబీసీడీలు కూడా నేర్చుకోలేదనే విషయం నాకు అర్థమవుతుంది అంటూ మధుసూదన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Read Also: Hyderabad: మియాపూర్లో దారుణం.. ఆరేళ్ల బాలుడిని పీక్కుతిన్న కుక్కలు
Also Read
తాజాగా ప్రభుత్వం నుంచి పునర్ నియామక ఉత్తర్వులు రాలేదు కాబట్టి 1654 మంది అతిథి ఆధ్యాపకులను మూల్యాంకన కేంద్రాల్లో అడుగుపెట్టనీయొద్దని ఇంటర్ బోర్డు కార్యదర్శి హుకుం జారీ చేయడమే కాకుండా వారి నియామక పత్రాలను రద్దు పరిచారని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 800 నుంచి 1000 ప్రైవేటు కళాశాలలకు ఇంకా అనుబంధ కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదు.. అనుబంధ గుర్తింపు ఇచ్చే అధికారం కూడా ప్రస్తుతం మీకు లేదు శృతి ఓజా.. ప్రభుత్వం మినహింపు ఉత్తర్వులు ఇస్తే తప్ప మీరు ఏమి చేయలేరని ఆయన చెప్పుకొచ్చారు. మరి అనుమతి లేని కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులు మీకు ముద్దు ఎలా అయ్యారు.. గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న ఈ అతిధి అధ్యాపకులు శత్రువులు ఎలా అయ్యారని ప్రశ్నించారు.
Read Also: India Alliance Meeting: సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై ఎం నిర్ణయంతీసుకోబోతున్నారు
ఇంటర్ బోర్డులో కార్యదర్శిగా శృతి ఓజా విధులు నిర్వహించేటటువంటి సామర్ధ్యం కానీ, తెలివితేటలు గానీ.. మీకు ఉన్నట్లుగా కనిపించడం లేదు ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి తక్షణం ఇంటర్ విద్య మండలి సెక్రెటరీని తప్పించి ఏదైనా ఒక విభాగానికి బదిలీ చేసి ఇంటర్ బోర్డును కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.. అతిథి ఆధ్యాపకుల పైన నవీన్ మిట్టల్ హయాంలో కొనసాగిన అక్కస్సు ఇంకా కూడా కొనసాగడం విచారకరం.. గెస్ట్ ఆధ్యాపకులపై ఇలాంటి వివక్షను కొనసాగించే ప్రయత్నం చేస్తున్న ఇంటర్ బోర్డు అధికారులకు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు.
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!