TS High Court: రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేకపోవడంపై దాఖలైన పిటిషన్ పై ఇవాళ ( మంగళవారం ) తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని పిటీషనర్ వాదనలు వినిపించాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బాలికలు, బాలురు జీవించే హక్కును కలిగి ఉన్నారని పిటీషనర్ పేర్కొన్నారు. నాణ్యమైన ఆహారం లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు అంటూ తెలిపారు. మంచినీరు, కిచెన్, మరుగుదొడ్లు పరిశుభ్రత లేక విద్యార్థులు కడుపు నొప్పి, తలనొప్పి, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారన్న పటిషనర్ హైకోర్టుకు తెలిపారు.
Read Also: Bandla Ganesh: చీము నెత్తురు ఉన్న ఉద్యోగులు బాబు కోసం నెల రోజులు ధర్నాలు చేయాలి !
Also Read
దీంతో పిటిషనర్ వాదనలు విన్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం సమగ్ర నివేదికను సమర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్కుమార్ల డివిజన్ బెంచ్ తెలిపింది. ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టల్స్ లోని బాత్రూమ్స్, టాయిలెట్స్, దిండ్లు, పరుపులు లాంటివి విద్యార్థులకు సరిపడా ఉన్నాయో.. లేవో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అగ్నిమాపక యంత్రాలు, వార్డెన్ల సంఖ్యతో కూడిన లిస్ట్ ను ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ హాస్టల్స్ లో బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్–2018 నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వసతుల్లేవంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ మేరకు సౌకర్యాలు కల్పించడం లేదని.. పది మందికి ఒకే బాత్ రూం, ఏడుగురికి ఒక టాయిలెట్, 50 మందికో వార్డెన్ ఉండాలనే నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్ తరపు లాయర్ వాదించాడు.
Read Also: PM Modi: ప్రధాని మోడీ ఫోన్ హ్యాక్, ట్రాక్ చేయలేరు..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!