TS High Court: రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేకపోవడంపై దాఖలైన పిటిషన్ పై ఇవాళ ( మంగళవారం ) తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఉచిత, నిర్బంధ, విద్య హక్కు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని పిటీషనర్ వాదనలు వినిపించాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బాలికలు, బాలురు జీవించే హక్కును కలిగి ఉన్నారని పిటీషనర్ పేర్కొన్నారు. నాణ్యమైన ఆహారం లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు అంటూ తెలిపారు. మంచినీరు, కిచెన్, మరుగుదొడ్లు పరిశుభ్రత లేక విద్యార్థులు కడుపు నొప్పి, తలనొప్పి, తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారన్న పటిషనర్ హైకోర్టుకు తెలిపారు.
Read Also: Bandla Ganesh: చీము నెత్తురు ఉన్న ఉద్యోగులు బాబు కోసం నెల రోజులు ధర్నాలు చేయాలి !
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
దీంతో పిటిషనర్ వాదనలు విన్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం సమగ్ర నివేదికను సమర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్కుమార్ల డివిజన్ బెంచ్ తెలిపింది. ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టల్స్ లోని బాత్రూమ్స్, టాయిలెట్స్, దిండ్లు, పరుపులు లాంటివి విద్యార్థులకు సరిపడా ఉన్నాయో.. లేవో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అగ్నిమాపక యంత్రాలు, వార్డెన్ల సంఖ్యతో కూడిన లిస్ట్ ను ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ హాస్టల్స్ లో బాలల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్–2018 నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా వసతుల్లేవంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ మేరకు సౌకర్యాలు కల్పించడం లేదని.. పది మందికి ఒకే బాత్ రూం, ఏడుగురికి ఒక టాయిలెట్, 50 మందికో వార్డెన్ ఉండాలనే నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్ తరపు లాయర్ వాదించాడు.
Read Also: PM Modi: ప్రధాని మోడీ ఫోన్ హ్యాక్, ట్రాక్ చేయలేరు..
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!