Mrs World 2022: మిసెస్ వరల్డ్గా సర్గం కౌశల్.. 21 ఏళ్ల తర్వాత దేశానికి కిరీటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrs World 2022 Sargam Koushal: భారతదేశానికి చెందిన సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022గా గెలిచి 21 సంవత్సరాల తర్వాత తిరిగి కిరీటాన్ని తెచ్చిపెట్టింది. లాస్ వెగాస్లో జరిగిన గాలా ఈవెంట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్గమ్ కౌశల్ ఈ రోజు మిసెస్ వరల్డ్ కిరీటాన్ని పొందారు. శ్రీమతి కౌశల్ 63 దేశాల నుండి పోటీదారులను ఓడించి 21 ఏళ్ల తర్వాత భారతదేశానికి టైటిల్ను తీసుకువచ్చారు. సర్గం కౌశల్ జమ్మూ కాశ్మీర్కు చెందినవారు.
మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఈ వార్తను ఇన్స్టాగ్రామ్ ఈ వార్తను వెల్లడించింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్కు కిరీటం దక్కిందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన సర్గమ్ కౌశల్ కూడా టైటిల్ గెలుచుకున్నందుకు ఎంత ఉల్లాసంగా ఉందో వివరిస్తూ వీడియోను పంచుకున్నారు. “21-22 ఏళ్ల తర్వాత మళ్లీ కిరీటాన్ని అందుకున్నాం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. లవ్ యూ ఇండియా, లవ్ యూ వరల్డ్” అని కొత్తగా కిరీటం పొందిన మిసెస్ వరల్డ్ సర్గం కౌశల్ అన్నారు. కౌశల్ ఇన్స్టా పోస్ట్ల ప్రకారం.. ఆమె ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉంది. ఆమె గతంలో వైజాగ్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. తన భర్త ఇండియన్ నేవీలో పనిచేస్తున్నారని కూడా పంచుకున్నారు.
Also Read
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..
Niharika Konidela: మెగా డాటర్ బర్త్ డే.. చైతు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే పరిగెత్తాల్సిందే
వివాహిత మహిళల కోసం నిర్వహించే అందాల పోటీ మిసెస్ వరల్డ్. ఈ పోటీ 1984లో ఉద్భవించింది. ఇది అమెరికాలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ పోటీకి ప్రారంభంలో మిసెస్ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్ అని పేరు పెట్టారు. ఇది 1988లో మాత్రమే మిసెస్ వరల్డ్ అని పిలువబడింది. 80కి పైగా దేశాల శ్రీమతులు పాల్గొంటున్న ఈ అందాల పోటీల్లో అత్యధికంగా అమెరికా దేశానికి చెందిన వారే విజేతలుగా నిలిచారు. భారతదేశం ఒక్కసారి మాత్రమే మిసెస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకుంది. 2001లో డాక్టర్ అదితి గోవిత్రికర్ గౌరవనీయమైన కిరీటాన్ని కైవసం చేసుకుంది. డాక్టర్ గోవిత్రికర్ ఇప్పుడు మిసెస్ ఇండియా 2022-23కి న్యాయనిర్ణేతగా పనిచేశారు. కిరీటాన్ని సాధించిన సర్గం కౌశల్ను అదితి గోవిత్రికర్ అభినందించారు.
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!