Mrs World 2022: మిసెస్ వరల్డ్గా సర్గం కౌశల్.. 21 ఏళ్ల తర్వాత దేశానికి కిరీటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrs World 2022 Sargam Koushal: భారతదేశానికి చెందిన సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022గా గెలిచి 21 సంవత్సరాల తర్వాత తిరిగి కిరీటాన్ని తెచ్చిపెట్టింది. లాస్ వెగాస్లో జరిగిన గాలా ఈవెంట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్గమ్ కౌశల్ ఈ రోజు మిసెస్ వరల్డ్ కిరీటాన్ని పొందారు. శ్రీమతి కౌశల్ 63 దేశాల నుండి పోటీదారులను ఓడించి 21 ఏళ్ల తర్వాత భారతదేశానికి టైటిల్ను తీసుకువచ్చారు. సర్గం కౌశల్ జమ్మూ కాశ్మీర్కు చెందినవారు.
మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఈ వార్తను ఇన్స్టాగ్రామ్ ఈ వార్తను వెల్లడించింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్కు కిరీటం దక్కిందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన సర్గమ్ కౌశల్ కూడా టైటిల్ గెలుచుకున్నందుకు ఎంత ఉల్లాసంగా ఉందో వివరిస్తూ వీడియోను పంచుకున్నారు. “21-22 ఏళ్ల తర్వాత మళ్లీ కిరీటాన్ని అందుకున్నాం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. లవ్ యూ ఇండియా, లవ్ యూ వరల్డ్” అని కొత్తగా కిరీటం పొందిన మిసెస్ వరల్డ్ సర్గం కౌశల్ అన్నారు. కౌశల్ ఇన్స్టా పోస్ట్ల ప్రకారం.. ఆమె ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉంది. ఆమె గతంలో వైజాగ్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. తన భర్త ఇండియన్ నేవీలో పనిచేస్తున్నారని కూడా పంచుకున్నారు.
Also Read
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
Niharika Konidela: మెగా డాటర్ బర్త్ డే.. చైతు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే పరిగెత్తాల్సిందే
వివాహిత మహిళల కోసం నిర్వహించే అందాల పోటీ మిసెస్ వరల్డ్. ఈ పోటీ 1984లో ఉద్భవించింది. ఇది అమెరికాలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ పోటీకి ప్రారంభంలో మిసెస్ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్ అని పేరు పెట్టారు. ఇది 1988లో మాత్రమే మిసెస్ వరల్డ్ అని పిలువబడింది. 80కి పైగా దేశాల శ్రీమతులు పాల్గొంటున్న ఈ అందాల పోటీల్లో అత్యధికంగా అమెరికా దేశానికి చెందిన వారే విజేతలుగా నిలిచారు. భారతదేశం ఒక్కసారి మాత్రమే మిసెస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకుంది. 2001లో డాక్టర్ అదితి గోవిత్రికర్ గౌరవనీయమైన కిరీటాన్ని కైవసం చేసుకుంది. డాక్టర్ గోవిత్రికర్ ఇప్పుడు మిసెస్ ఇండియా 2022-23కి న్యాయనిర్ణేతగా పనిచేశారు. కిరీటాన్ని సాధించిన సర్గం కౌశల్ను అదితి గోవిత్రికర్ అభినందించారు.
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!