Mrs World 2022 Sargam Koushal: భారతదేశానికి చెందిన సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022గా గెలిచి 21 సంవత్సరాల తర్వాత తిరిగి కిరీటాన్ని తెచ్చిపెట్టింది. లాస్ వెగాస్లో జరిగిన గాలా ఈవెంట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్గమ్ కౌశల్ ఈ రోజు మిసెస్ వరల్డ్ కిరీటాన్ని పొందారు. శ్రీమతి కౌశల్ 63 దేశాల నుండి పోటీదారులను ఓడించి 21 ఏళ్ల తర్వాత భారతదేశానికి టైటిల్ను తీసుకువచ్చారు. సర్గం కౌశల్ జమ్మూ కాశ్మీర్కు చెందినవారు.
మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఈ వార్తను ఇన్స్టాగ్రామ్ ఈ వార్తను వెల్లడించింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్కు కిరీటం దక్కిందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన సర్గమ్ కౌశల్ కూడా టైటిల్ గెలుచుకున్నందుకు ఎంత ఉల్లాసంగా ఉందో వివరిస్తూ వీడియోను పంచుకున్నారు. “21-22 ఏళ్ల తర్వాత మళ్లీ కిరీటాన్ని అందుకున్నాం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. లవ్ యూ ఇండియా, లవ్ యూ వరల్డ్” అని కొత్తగా కిరీటం పొందిన మిసెస్ వరల్డ్ సర్గం కౌశల్ అన్నారు. కౌశల్ ఇన్స్టా పోస్ట్ల ప్రకారం.. ఆమె ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉంది. ఆమె గతంలో వైజాగ్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. తన భర్త ఇండియన్ నేవీలో పనిచేస్తున్నారని కూడా పంచుకున్నారు.
Niharika Konidela: మెగా డాటర్ బర్త్ డే.. చైతు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే పరిగెత్తాల్సిందే
వివాహిత మహిళల కోసం నిర్వహించే అందాల పోటీ మిసెస్ వరల్డ్. ఈ పోటీ 1984లో ఉద్భవించింది. ఇది అమెరికాలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ పోటీకి ప్రారంభంలో మిసెస్ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్ అని పేరు పెట్టారు. ఇది 1988లో మాత్రమే మిసెస్ వరల్డ్ అని పిలువబడింది. 80కి పైగా దేశాల శ్రీమతులు పాల్గొంటున్న ఈ అందాల పోటీల్లో అత్యధికంగా అమెరికా దేశానికి చెందిన వారే విజేతలుగా నిలిచారు. భారతదేశం ఒక్కసారి మాత్రమే మిసెస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకుంది. 2001లో డాక్టర్ అదితి గోవిత్రికర్ గౌరవనీయమైన కిరీటాన్ని కైవసం చేసుకుంది. డాక్టర్ గోవిత్రికర్ ఇప్పుడు మిసెస్ ఇండియా 2022-23కి న్యాయనిర్ణేతగా పనిచేశారు. కిరీటాన్ని సాధించిన సర్గం కౌశల్ను అదితి గోవిత్రికర్ అభినందించారు.