Tamil Nadu Doctor Rape Case: మహిళా డాక్టర్పై సామూహిక అత్యాచారం.. నలుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష..
- లేడీ డాక్టర్పై సామూహిక అత్యాచారం..
- నలుగురు నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..
- 2022లో సంచలనం సృష్టించిన వెల్లూర్ గ్యాంగ్ రేప్ కేసు..
- రాజకీయంగా సంచలనం సృష్టించిన కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Doctor Rape Case:2022లో తమిళనాడులో ఓ మహిళా డాక్టర్పై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులు నలుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మహిళా కోర్టు తీర్పు చెప్పింది. ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయ ఆగ్రహానికి కారణమైంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Read Also: Ragging: ‘‘టాయ్లెట్ సీటుని నాకించారు’’.. ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల విద్యార్థి బలి..
Also Read
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
ఈ నేరంలో అరెస్టయిన నిందితులను ఆటో డ్రైవర్ పార్థిబన్, దినసరి కూలీ కార్మికుడు మణి అలియాస్ మణికందన్, అతడి స్నేహితులు భరత్, సంతోష్లుగా గుర్తించారు. ఐదవ నిందితుడు బాలనేరస్తుడు కావడంతో జువైనల్ బోర్డ్ ముందు విచారణ ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిన గురువారం వెల్లూర్ సెషన్స్ జడ్జి(ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్టు) ఎస్ మాగేశ్వరి భాను రేఖ ముందు హాజరుపరిచారు, వీరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు ఒక్కొక్కరికి రూ. 25,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
బాధిత వైద్యురాలు, తన పురుష సహోద్యోగితో కలిసి మార్చి 16, 2022న తెల్లవారుజామున 12.30 గంటలకు కాట్పాడిలో ఆటో కోసం వేచి చూస్తుండగా, ఆటోలో వచ్చిన ఐదుగురు సభ్యుల ముఠా, షేర్ ఆటో అని చెప్పి వారిని ఎక్కించుకున్నారు. ఇద్దరిని పాలర్ నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడ ముఠా వైద్యురాలు, ఆమె ఫ్రెండ్పై దాడి చేసి, కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశారు. ఇద్దరి మొబైల్ ఫోన్లతో పాటు బంగారు ఆభరణాలను, ఏటిఎం కార్డుని తీసుకుని పారిపోయారు. కార్డ్ నుంచి రూ. 40,000 విత్ డ్రా చేశారు. తాగిన మత్తులో ముఠాలోని ముగ్గురు సభ్యులు గొడవ పడిన కేసుని విచారిస్తుండగా, ఈ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత లేడీ డాక్టర్ నుంచి పోలీసులు ఆన్లైన్ ఫిర్యాదుతో కేసుని విచారించి, నిందితులకు శిక్ష పడేలా చేశారు.
తాజావార్తలు
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!