Tamil Nadu Doctor Rape Case: మహిళా డాక్టర్పై సామూహిక అత్యాచారం.. నలుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష..
- లేడీ డాక్టర్పై సామూహిక అత్యాచారం..
- నలుగురు నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..
- 2022లో సంచలనం సృష్టించిన వెల్లూర్ గ్యాంగ్ రేప్ కేసు..
- రాజకీయంగా సంచలనం సృష్టించిన కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Doctor Rape Case:2022లో తమిళనాడులో ఓ మహిళా డాక్టర్పై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులు నలుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మహిళా కోర్టు తీర్పు చెప్పింది. ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయ ఆగ్రహానికి కారణమైంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Read Also: Ragging: ‘‘టాయ్లెట్ సీటుని నాకించారు’’.. ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల విద్యార్థి బలి..
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఈ నేరంలో అరెస్టయిన నిందితులను ఆటో డ్రైవర్ పార్థిబన్, దినసరి కూలీ కార్మికుడు మణి అలియాస్ మణికందన్, అతడి స్నేహితులు భరత్, సంతోష్లుగా గుర్తించారు. ఐదవ నిందితుడు బాలనేరస్తుడు కావడంతో జువైనల్ బోర్డ్ ముందు విచారణ ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిన గురువారం వెల్లూర్ సెషన్స్ జడ్జి(ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్టు) ఎస్ మాగేశ్వరి భాను రేఖ ముందు హాజరుపరిచారు, వీరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు ఒక్కొక్కరికి రూ. 25,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
బాధిత వైద్యురాలు, తన పురుష సహోద్యోగితో కలిసి మార్చి 16, 2022న తెల్లవారుజామున 12.30 గంటలకు కాట్పాడిలో ఆటో కోసం వేచి చూస్తుండగా, ఆటోలో వచ్చిన ఐదుగురు సభ్యుల ముఠా, షేర్ ఆటో అని చెప్పి వారిని ఎక్కించుకున్నారు. ఇద్దరిని పాలర్ నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడ ముఠా వైద్యురాలు, ఆమె ఫ్రెండ్పై దాడి చేసి, కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశారు. ఇద్దరి మొబైల్ ఫోన్లతో పాటు బంగారు ఆభరణాలను, ఏటిఎం కార్డుని తీసుకుని పారిపోయారు. కార్డ్ నుంచి రూ. 40,000 విత్ డ్రా చేశారు. తాగిన మత్తులో ముఠాలోని ముగ్గురు సభ్యులు గొడవ పడిన కేసుని విచారిస్తుండగా, ఈ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత లేడీ డాక్టర్ నుంచి పోలీసులు ఆన్లైన్ ఫిర్యాదుతో కేసుని విచారించి, నిందితులకు శిక్ష పడేలా చేశారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!