Tamil Nadu Doctor Rape Case: మహిళా డాక్టర్పై సామూహిక అత్యాచారం.. నలుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష..
- లేడీ డాక్టర్పై సామూహిక అత్యాచారం..
- నలుగురు నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..
- 2022లో సంచలనం సృష్టించిన వెల్లూర్ గ్యాంగ్ రేప్ కేసు..
- రాజకీయంగా సంచలనం సృష్టించిన కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Doctor Rape Case:2022లో తమిళనాడులో ఓ మహిళా డాక్టర్పై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులు నలుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మహిళా కోర్టు తీర్పు చెప్పింది. ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయ ఆగ్రహానికి కారణమైంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Read Also: Ragging: ‘‘టాయ్లెట్ సీటుని నాకించారు’’.. ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల విద్యార్థి బలి..
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఈ నేరంలో అరెస్టయిన నిందితులను ఆటో డ్రైవర్ పార్థిబన్, దినసరి కూలీ కార్మికుడు మణి అలియాస్ మణికందన్, అతడి స్నేహితులు భరత్, సంతోష్లుగా గుర్తించారు. ఐదవ నిందితుడు బాలనేరస్తుడు కావడంతో జువైనల్ బోర్డ్ ముందు విచారణ ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిన గురువారం వెల్లూర్ సెషన్స్ జడ్జి(ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్టు) ఎస్ మాగేశ్వరి భాను రేఖ ముందు హాజరుపరిచారు, వీరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు ఒక్కొక్కరికి రూ. 25,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
బాధిత వైద్యురాలు, తన పురుష సహోద్యోగితో కలిసి మార్చి 16, 2022న తెల్లవారుజామున 12.30 గంటలకు కాట్పాడిలో ఆటో కోసం వేచి చూస్తుండగా, ఆటోలో వచ్చిన ఐదుగురు సభ్యుల ముఠా, షేర్ ఆటో అని చెప్పి వారిని ఎక్కించుకున్నారు. ఇద్దరిని పాలర్ నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడ ముఠా వైద్యురాలు, ఆమె ఫ్రెండ్పై దాడి చేసి, కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశారు. ఇద్దరి మొబైల్ ఫోన్లతో పాటు బంగారు ఆభరణాలను, ఏటిఎం కార్డుని తీసుకుని పారిపోయారు. కార్డ్ నుంచి రూ. 40,000 విత్ డ్రా చేశారు. తాగిన మత్తులో ముఠాలోని ముగ్గురు సభ్యులు గొడవ పడిన కేసుని విచారిస్తుండగా, ఈ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత లేడీ డాక్టర్ నుంచి పోలీసులు ఆన్లైన్ ఫిర్యాదుతో కేసుని విచారించి, నిందితులకు శిక్ష పడేలా చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!