Indian Railway: ఇంత టాలెంటెడ్ గా ఉన్నారెంట్రా బాబు.. చలికాచుకోడానికి ట్రైన్లో నిప్పేంట్రా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లో కదులుతున్న రైలులో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. చలి నుంచి తప్పించుకునేందుకు కొందరు ప్రయాణికులు ట్రైన్ భోగిలోనే మంటలు వేశారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే సీఆర్పీఎఫ్ సిబ్బంది ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, అస్సాం నుంచి ఢిల్లీకి వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే జనరల్ కోచ్ కంపార్ట్మెంట్ నుంచి పొగలు రావడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమైంది. అక్కడికి చేరుకోగానే ట్రైన్ భోగిలో మంటలు కాల్చుతున్న ప్రయాణికుల గుంపు కనిపిచింది. అది చూసిన పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే మంటలు ఆర్పివేశారు. విచారణ కోసం చందన్, దేవేంద్ర అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని అలీగఢ్లోని ఆర్పీఎఫ్ పీఎస్ కు తరలించారు.
Read Also: Btech Student: బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య ఘటన.. పటాన్ చెరు డీఎస్పీ వివరణ..
Also Read
అయితే, నిందితులిద్దరూ ఫరీదాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. అయితే, సదరు యువకుల దగ్గర ఆవు పిడకలు చూసి వారు ఆశ్చర్యపోయారు. కదులుతున్న రైలులో చలి విపరీతంగా ఉండడంతో మంటలు వేయాల్సి వచ్చిందని యువకులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ విషయంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
Read Also: Japan Earthquake : జపాన్ లో భూకంపం.. విశాఖలో వెనక్కి వెళ్లిన సముద్రం
చలి నుంచి కాపాడుకునేందుకు తాము ట్రైన్ భోగిలో మంట వెలిగించామని ఆర్పీఎఫ్ సిబ్బందికి తెలిపారు. నిందితులను రైల్వే చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు ఆర్పీఎఫ్ అలీఘర్ పోస్ట్ కమాండర్ రాజీవ్ శర్మ చెప్పారు. వీరితో పాటు మరో 14 మంది ప్రయాణికులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామన్నారు. ట్రైన్ లో కానీ, రైల్వే ప్లాట్ఫారమ్, రైల్వే స్టేషన్ సమీపంలో అలాంటివి విక్రయించకూడదని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!