Indian Navy Rescues: 19 మంది పాకిస్థానీ నావికుల్ని రక్షించిన భారత నౌకాదళం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INS Sumitra Rescues 19 Pakistani nationals form Somali Pirates: భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర మరో ఆపరేషన్ను విజయవంతంగా పూర్తిచేసింది. అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన 19 మంది పాకిస్తానీ నావికులతో కూడిన ఓడను రక్షించింది. అల్ నయీమీ అనే ఫిషింగ్ నౌకపై జరిగిన దాడిని ఐఎన్ఎస్ సుమిత్ర అడ్డుకుంది. 11 మంది సోమాలియా సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్తానీ సిబ్బందిని ఐఎన్ఎస్ సుమిత్ర రక్షించినట్లు భారత నేవీ ప్రతినిధి ఒకరు ఎక్స్లో పేర్కొన్నారు.
సోమవారం సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్ నయీమీ ఫిషింగ్ నౌకను సముద్రపు దొంగలు చుట్టుముట్టారు. 19 మంది పాకిస్థానీ నావికుల్ని వారు బంధించారు. సమాచారం అందుకున్న భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర.. ఆ ఓడను అడ్డుకుంది. అందులోని బందీలను విడిపించింది. సోమవారం తెల్లవారుజామున కూడా ఐఎన్ఎస్ సుమిత్ర ఓ ఆపరేషన్ను చేసింది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్ చేపల బోటు ఎంవీ ఇమాన్ను సోమాలియా దొంగలు హైజాక్ చేశారు. తమను రక్షించమని ఇరాన్ బోటు నుంచి ఆదివారం భారత్ నౌకాదళానికి అత్యవసర సందేశం వచ్చింది. రంగంలోకి దిగిన ఐఎన్ఎస్ సుమిత్ర, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్.. 17 మంది మత్స్యకారులను రక్షించింది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Also Read: Indian Student: అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి.. యూనివర్సిటీ క్యాంపస్లోనే..!
2023 అక్టోబరు 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తర్వాత ఎర్రసముద్రంలో వ్యాపార నౌకలు హైజాక్ అవుతున్నాయి. ఇరాన్ మద్దతుగల యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు.. క్షిపణులు, డ్రోన్లతో ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఆయిల్ ట్యాంకర్లతో వెళుతున్న మార్లిన్ లాండ నౌకపై క్షిపణితో దాడి చేశారు. ఆ నౌక నుంచి వచ్చిన సందేశానికి స్పందించిన భారత నేవీ.. సమీపంలోని ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను రంగంలోకి దింపి సహాయ చర్యలు చేపట్టింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!