Laureus World Team of the Year: భారత మహిళల జట్టు గతః ఏడాది నవంబరులో సాధించిన చారిత్రాత్మక విజయానికి ప్రపంచ వేదికపై అరుదైన గౌరవానికి నామినేషన్ లభించింది. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2026లో ‘వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ విభాగానికి భారత మహిళల జట్టు ఈసారి నామినేట్ అయ్యింది. నామినేషన్లను మంగళవారం నాడు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ప్రకటించగా.. విజేతలను లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ ఎంపిక చేసి ఏప్రిల్ 20న జరిగే గాలా వేడుకలో ప్రకటించనున్నారు. ఈ వేడుక “సిబెల్స్ ప్యాలస్”లో వైభవంగా జరుగనుంది.
Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు భారత్తో పాటు ఈ జట్లు కూడా నామినేట్ అయ్యాయి:
* Paris Saint-Germain (ఫుట్బాల్ – ఫ్రాన్స్)
* McLaren Formula 1 Team (ఫార్ములా 1 – యూకే)
* European Ryder Cup Team (గోల్ఫ్ – యూరప్)
* England women’s national football team (ఫుట్బాల్ – యూకే)
* Oklahoma City Thunder (బాస్కెట్బాల్ – యూఎస్ఏ)
ఈ అరుదైన నామినేషన్ సంబంధించి బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ మాట్లాడుతూ.. “ఈ నామినేషన్ భారత క్రికెట్కు అపార గౌరవం. మా మహిళల జట్టు అసాధారణ నైపుణ్యం, ధైర్యం, స్థిరత్వం ప్రదర్శించి 2025లో చరిత్ర సృష్టించిందని.. ప్రపంచ క్రీడల్లో అగ్ర జట్ల సరసన నిలవడం వారి కృషికి గొప్ప గుర్తింపని అన్నారు.
ఇకపోతే 2025 మహిళల వరల్డ్ కప్లో భారత్ ప్రయాణం రోలర్ కోస్టర్లా సాగిందని చెప్పాలి. టోర్నీ మొదట్లో శ్రీలంకపై 59 పరుగుల విజయం, ఆపై పాకిస్తాన్ మీద 88 పరుగుల తేడాతో గెలుపులు లభించినా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల చేతిలో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితులలో మంచి ఆరంభాలు అందించిన ప్రతీక రవాల్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడం జట్టుకు పెద్ద షాక్గా మారింది. ఆమె స్థానంలో షఫాలి వర్మను జట్టులోకి తీసుకున్నారు.
Virosh : అభిమానులతో కలిసి భోజనం చేసిన ‘విరోష్’.. విజయ్-రష్మికల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!
ఇక సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రికార్డు లక్ష్యాన్ని చేధించిన భారత్, ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలి వరల్డ్ కప్ కిరీటాన్ని ముద్దాడింది. నవి ముంబైలోని DY పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో షఫాలి వర్మ 87 పరుగులు, రెండు వికెట్లు సాధించగా.. దీప్తి శర్మ 58 పరుగులతో పాటు ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశారు. ఈ విజయం దేశవ్యాప్తంగా సంబరాలను చేసుకొనేలా చేసింది. దీనితో మహిళా క్రికెట్పై ఆసక్తి మరింతగా పెరిగింది.