India vs WI: వెస్టిండీస్తో పోరుకు టీమిండియా ప్రకటన.. జట్టులోకి తిరిగొచ్చిన తెలుగోడు!
- వెస్టిండీస్ టెస్టులకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఎంపిక
- జడేజా వైస్ కెప్టెన్.
- బీసీసీఐ ప్రకటించిన 15 మంది జట్టు
- రిషభ్ పంత్ గాయం కారణంగా దూరం.
- కరుణ్ నాయర్ పై వేటు
- నితీశ్ రెడ్డి రీఎంట్రీ, జగదీశన్కు వికెట్ కీపర్ ఛాన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs WI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెస్టిండీస్తో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. యువ బ్యాట్స్మెన్ శుబ్మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఇకపోతే, ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన జట్టుతో పోలిస్తే కొన్ని స్వల్ప మార్పులు చేశారు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సిరీస్కు దూరమయ్యాడు. అలాగే, ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచిన కరుణ్ నాయర్పై వేటు పడింది. ఏడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన నాయర్, నాలుగు మ్యాచ్లలో కేవలం ఒకే ఒక్క అర్ధసెంచరీ చేయడంతో వేటు తప్పలేదు.
Zelenskyy: రష్యా తీరును ప్రపంచ దేశాలు ఖండించాలి.. యూఎన్లో జెలెన్స్కీ పిలుపు
Also Read
- ICC Women's T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
- Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్' ప్రారంభించనున్న సీఎం.!
వికెట్ కీపర్ కోటాలో పంత్ గైర్హాజరీతో ధ్రువ్ జురెల్ తో పాటు తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశన్కు కూడా చోటు దక్కింది. గాయం కారణంగా ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో దూరమైన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి విండీస్తో సిరీస్తో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక బౌలింగ్ విభాగం విషయానికి వస్తే.. పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్తో కలిసి ప్రసిద్ కృష్ణ సేవలు అందించనున్నారు. స్పిన్ విభాగంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్తో పాటు వాషింగ్టన్ సుందర్ బరిలో దిగనున్నారు. ఈ టెస్టు సిరీస్ 2025-27లో భాగంగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు జరుగుతుంది.
టీమిండియా జట్టు:
శుబ్మన్ గిల్ (C), రవీంద్ర జడేజా (V), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (W), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నారాయణ్ జగదీశన్ (W), కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
🚨 Presenting #TeamIndia's squad for the West Indies Test series 🔽#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/S4D5mDGJNN
— BCCI (@BCCI) September 25, 2025
తాజావార్తలు
-
Rohit Sharma: ‘అతనికి ప్రతిభ పుట్టుకతో రాలేదు..’ రోహిత్ శర్మపై రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raj Nidimoru : హిందీ సినిమాలలో మెగాస్టార్ రిఫరెన్స్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా ?
-
ICC Women’s T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
-
Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
-
Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!