India vs South Africa 3rd T20I: భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
- ధర్మశాల వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్
- టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs South Africa 3rd T20I: ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా మూడో టీ20 మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణయం పూర్తిగా ఫలించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు భారత బౌలర్ల దెబ్బకు ఉక్కిరిబిక్కిరై నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటయ్యారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే సఫారీ జట్టుకు భారీ షాక్ తగిలింది. క్వింటన్ డికాక్ (1), రీజా హెండ్రిక్స్ (0)లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. పవర్ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో దక్షిణాఫ్రికా ఒత్తిడిలో పడింది. ఒకదశలో 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. ఆ తర్వాత కెప్టెన్ ఏడెన్ మార్క్రామ్ ఒంటరిగా పోరాడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
Lionel Messi: మెస్సీ రాకపై సచిన్ భావోద్వేగ వ్యాఖ్యలు.. నంబర్ 10 జెర్సీ బహూకరణ
Also Read
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- Toyota Fortuner: పెట్రోల్, డీజిల్కు గుడ్ బై.. 100% ఇథనాల్తో నడిచే కొత్త టొయోటా ఫార్చ్యూనర్ వచ్చేసిందోచ్..!
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
- TSLPRB Recruitment 2026: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
మార్క్రామ్ 46 బంతుల్లో 61 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే మరో వైపు నుంచి సరైన మద్దతు లేకపోవడంతో స్కోరు మందగించింది. డేవాల్డ్ బ్రెవిస్ (2), ట్రిస్టన్ స్టబ్స్ (9), కార్బిన్ బోష్ (4)లు విఫలమయ్యారు. చివర్లో డోనోవన్ ఫెరెయిరా 20 పరుగులు చేసినా స్కోరుపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక భారత బౌలర్లలో లాస్ట్ మ్యాచ్ లో దారుణంగా వైడ్స్ వేసి భారీగా పరుగులు ఇచ్చిన అర్ష్దీప్ సింగ్అ.. ఈసారి మాత్రం ద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి కూడా 4 ఓవర్లలో 11 పరుగులకే 2 వికెట్లు తీసి సఫారీ బ్యాటింగ్ను కట్టడి చేశాడు. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ లు చేరి 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే ఒక్కో వికెట్ సాధించారు. దీంతో టీమిండియా మ్యాచ్ గెలుపు కోసం 118 పరుగులు చేయాల్సి ఉంది. చూడాలిమరి ధర్మశాల మైదానంలో టీమిండియా బ్యాటర్లు ఈ లక్ష్యాన్ని ఎంత త్వరగా ఛేదిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
Lionel Messi: మెస్సీ రాకపై సచిన్ భావోద్వేగ వ్యాఖ్యలు.. నంబర్ 10 జెర్సీ బహూకరణ
Innings Break!
A terrific collective show by the #TeamIndia bowlers 👌
Chase on the other side ⏳
Scorecard ▶️ https://t.co/AJZYgMAHc0#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/wLjHQjkyfO
— BCCI (@BCCI) December 14, 2025
తాజావార్తలు
-
Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
-
CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
-
Secret Soldier : టైటిల్ మారింది.. ‘సీక్రెట్ సోల్జర్’గా వస్తున్న ‘చైనా పీస్’!
-
GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
-
Toyota Fortuner: పెట్రోల్, డీజిల్కు గుడ్ బై.. 100% ఇథనాల్తో నడిచే కొత్త టొయోటా ఫార్చ్యూనర్ వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!