Lionel Messi: మెస్సీ రాకపై సచిన్ భావోద్వేగ వ్యాఖ్యలు.. నంబర్ 10 జెర్సీ బహూకరణ
- లియోనెల్ మెస్సీ ముంబై పర్యటనను “దేశానికి స్వర్ణ క్షణం”గా అభివర్ణించిన సచిన్ టెండూల్కర్
- ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సచిన్ భావోద్వేగ వ్యాఖ్యలు
- మెస్సీతో పాటు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ ముంబైకి రాక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lionel Messi: ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ముంబై పర్యటనను భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ “ముంబైకి, దేశానికి ఒక స్వర్ణ క్షణం”గా అభివర్ణించారు. తాజాగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో సచిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మెస్సీ, అతని సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ తో కలిసి ముంబైకి వచ్చారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ఈ మైదానంలో నేను ఎన్నో అద్భుత క్షణాలను అనుభవించాను. ముంబై కలల నగరం. అనేక కలలు ఈ వేదికపై సాకారం అయ్యాయి. అభిమానుల మద్దతు లేకపోతే, 2011లో ఈ మైదానంలో మేము ఆ స్వర్ణ క్షణాన్ని చూడలేకపోయేవాళ్లం అని అన్నారు. ఇక ఈ రోజు ఈ ముగ్గురు గొప్ప ఆటగాళ్లు ఇక్కడ ఉండటం ముంబైకి, ముంబై ప్రజలకు, భారతదేశానికి నిజంగా ఒక స్వర్ణ ఘట్టం. మీరు వారిని స్వాగతించిన తీరు అసాధారణం అని సచిన్ అన్నారు.
Also Read
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
- IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
అయితే మెస్సీ ఆట గురించి మాట్లాడేందుకు ఇది సరైన వేదిక కాదని, ఎందుకంటే అతడు తన కెరీర్లో అన్ని సాధించాడని సచిన్ అన్నారు. లియో విషయానికి వస్తే ఏం చెప్పాలి? అతడు అన్నీ గెలిచాడు. అతడి అంకితభావం, పట్టుదల, నిబద్ధత మాకు ఎంతో ప్రేరణనిస్తాయని వ్యాఖ్యానించారు. మెస్సీ వినయాన్ని ప్రశంసించిన సచిన్, యువతను ప్రోత్సహిస్తున్నందుకు అతనికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో భారత ఫుట్బాల్ కూడా కోరుకున్న స్థాయికి చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సచిన్, తన సంతకం చేసిన నంబర్ 10 జెర్సీని మెస్సీకి బహూకరించారు. దీనికి ప్రతిగా అర్జెంటీనా వరల్డ్కప్ విజేత కెప్టెన్ మెస్సీ సచిన్కు ఒక ఫుట్బాల్ అందజేశాడు. మెస్సీ ‘GOAT ఇండియా టూర్ 2025’లో భాగంగా ముంబైకి వచ్చారు. భారీ భద్రత నడుమ ఆయన మధ్యాహ్నం ముంబై చేరుకున్నారు. ఇది ఆయన నాలుగు నగరాల పర్యటనలో రెండో రోజు. సోమవారం ఆయన న్యూఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. దీనితో భారత్ పర్యటన ముగియనుంది. శనివారం తెల్లవారుజామున మెస్సీ భారత్కు చేరుకున్నప్పటికీ.. కోల్కతా పర్యటనలో గందరగోళం, భద్రతా లోపాలు చోటుచేసుకున్నాయి. అయితే హైదరాబాద్ పర్యటన మాత్రం ప్రశాంతంగా సాగి, సానుకూలంగా ముగిసింది.
After watching the events in Kolkata, Hyderabad, and Mumbai.
It was clear that while Messi met many celebrities, he seemed to ignore most of them. but when he met Sachin Tendulkar, the respect was unmistakable.
A true GOAT recognizing another GOAT 🐐pic.twitter.com/QVJVstLkFQ
— GillTheWill (@GillTheWill77) December 14, 2025
తాజావార్తలు
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!