India – America: భారత్-అమెరికా మధ్య దోస్తి.. 10 ఏళ్లకు కుదిరిన రక్షణ ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – America: భారతదేశం – అమెరికా మధ్య 10 సంవత్సరాల రక్షణ ఒప్పందం కుదిరింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన తర్వాత అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకోనున్నాయి. అలాగే ఇరు దేశాలు సాంకేతిక సహాయం కూడా అందించుకోనున్నాయి.
READ ALSO: 2025 బిలియనీర్ల ర్యాంకింగ్స్ – ఎవరి విలువ ఎంత ఉందో చూడండి!
Also Read
- PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన 'వాంఖేడే' పోరు..
- Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
- Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
పీట్ హెగ్సేత్ ఏమన్నారంటే..
రక్షణ ఒప్పందంపై పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ.. “ఈ రకమైన ఒప్పందం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. మేము 10 సంవత్సరాల పాటు రక్షణ ఒప్పందంపై సంతకం చేసాము. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సమన్వయాన్ని సృష్టించే ప్రయత్నం. ప్రాంతీయ స్థిరత్వాన్ని కొనసాగించడం, సైనిక సమన్వయాన్ని మరింతగా పెంచడం, రక్షణ సాంకేతిక సహకారాన్ని పెంపొందించడం ఈ ఒప్పందం ప్రాథమిక లక్ష్యం” అని అన్నారు.
అమెరికా – భారతదేశం మధ్య కుదిరిన ఈ రక్షణ ఒప్పందం ఇండో-పసిఫిక్ పై ప్రత్యక్ష ప్రభావాలను చూపుతుంది. ఈ ఒప్పందం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సైనిక సహకారం, ఉమ్మడి చొరవల కోసం దశాబ్ద కాలం పాటు సాగే రోడ్ మ్యాప్ను నిర్దేశిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా రక్షణ ఒప్పందం తర్వాత, రాజ్నాథ్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. ఈ ఒప్పందాన్ని కొత్త శకానికి నాందిగా ఆయన అభివర్ణించారు. “ఈ రక్షణ ఒప్పంద రోడ్మ్యాప్ భారతదేశం-అమెరికా రక్షణ సంబంధాలకు దిశానిర్దేశం చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. “ఇది ఇరుదేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక కలయికకు సంకేతం” అని అన్నారు.
ఇండో – పసిఫిక్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగినది, అలాగే ఆర్థికంగా చురుకైన ప్రాంతాలలో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం నాలుగు ఖండాలను కలిగి ఉంది. ఆ ప్రాంతాలు.. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా. ప్రపంచ జనాభాలో దాదాపు 60 శాతం మంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. భారతదేశం, చైనా, యునైటెడ్ స్టేట్స్ వంటి శక్తివంతమైన దేశాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఒకప్పుడు అమెరికా ఆధిపత్యం ఉండేది, కానీ చైనా దానిని తగ్గించింది. దీంతో ఇప్పుడు ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం బలపడుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు భయపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Indonesia New Capital: దేశ రాజధానిని మారుస్తున్న అతిపెద్ద ముస్లిం దేశం.. ఏ భయంతోనో తెలుసా!
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!