Indonesia New Capital: దేశ రాజధానిని మారుస్తున్న అతిపెద్ద ముస్లిం దేశం.. ఏ భయంతోనో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indonesia New Capital:ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా తన రాజధానిని మారుస్తోంది. ప్రస్తుతం ఇండోనేషియా రాజధానిగా జకార్తా ఉంది. కానీ ఇప్పుడు దేశ రాజధానిని నుసంతారాకు మారుస్తున్నారు. మాజీ అధ్యక్షుడు జోకో విడోడో మూడు సంవత్సరాల క్రితం ఈ కొత్త రాజధాని ప్రాజెక్టును ప్రారంభించారు. కలుషితమైన, రద్దీగా ఉండే జకార్తాను దేశ రాజధానిగా మార్చాలనే లక్ష్యంతో ఈ పనికి ముందుకు వచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
READ ALSO: IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 5360mAh బ్యాటరీతో వచ్చేసిన Vivo X300 ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్..!
Also Read
- Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
గత అక్టోబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన కొత్త అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హయాంలో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వ నిధులు సగానికి పైగా తగ్గించారు. అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రబోవో ఇప్పటి వరకు నుసంతారాను సందర్శించలేదు. కానీ ఆయన మే నెలలో నిశ్శబ్దంగా ప్రాజెక్టుకు రాజకీయ రాజధాని హోదాను మంజూరు చేశారు. అయితే దేశ అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్లో బహిరంగంగా ప్రకటించారు.
రాజధానిని ఎందుకు మారుస్తున్నారంటే..
ఇండోనేషియా రాజధాని జకార్తా. జావా ద్వీపంలో ఉన్న జకార్తా, ఆగస్టు 17, 1945న నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించినప్పటి నుంచి ఇండోనేషియా రాజధానిగా ఉంది. అప్పటి నుంచి జకార్తా 10.5 మిలియన్ల జనాభాతో విశాలమైన మహానగరంగా అభివృద్ధి చెందింది. అయితే జకార్తా చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతం సుమారు 30 మిలియన్లకు నివాసంగా ఉంది. ఈక్రమంలో నగరం వేగంగా మునిగిపోతోందని నివేదికలు వెలువడుతూనే ఉన్నాయి. 2030 నాటికి ఈ మహానగరంలోని కొన్ని ప్రాంతాలు తరచుగా వరదలకు గురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా కలుషితమైన, రద్దీగా ఉండే, మునిగిపోతున్న జకార్తాను ఖాళీ చేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. 2022లో ఇండోనేషియా రాజధాని తరలింపుకు నిధులు, పాలనను నియంత్రించే చట్టాన్ని ఆమోదించింది. కొత్త రాజధానిని ప్లాన్ చేస్తున్న కమిషన్, జకార్తా నుంచి రాజధానిని తరలించడం “అత్యవసరం” అని పేర్కొంది. ఎందుకంటే నగరం, జావా ద్వీపం “భారీ ట్రాఫిక్ రద్దీ, పర్యావరణ కాలుష్యం, రద్దీ జనాభా” నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని నివేదికల్లో వెల్లడించాయి.
కొత్త రాజధాని ఎలా ఉంది..
నుసంతారా క్యాపిటల్ అథారిటీ 2023 అచీవ్మెంట్ రిపోర్ట్లో కొత్త రాజధాని ఇండోనేషియా గ్రాండ్ స్ట్రాటజీ: 2045 గోల్డెన్ ఇండోనేషియా విజన్లో భాగమని ఆ దేశం వెల్లడించింది. ఈ కొత్త ప్రణాళిక 2045 నాటికి ఇండోనేషియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్ర్యం పొందిన 100వ వార్షికోత్సవం అని అధికారులు వెల్లడించారు. అథారిటీ ప్రణాళికల ప్రకారం.. నుసంతారా రాబోయే రెండు దశాబ్దాలలో ఆధునిక, స్థిరమైన నగరంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి వాణిజ్య మౌలిక సదుపాయాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా వ్యవస్థతో సహా అనేక దశల్లో పూర్తవుతుందని వెల్లడించారు.
నుసంతారాను స్పాంజ్ సిటీగా నిర్మిస్తున్నారు. అంటే వర్షపు నీటిని భూమిలోకి పీల్చుకోగల నగరంగా కొత్త రాజధానిని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ నగరానికి కొన్ని ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. 2035 నాటికి పేదరిక రేటును సున్నా శాతానికి తగ్గించడం ఇందులో ప్రధాన లక్ష్యం. 2045 నాటికి నికర-సున్నా ఉద్గారాలను సాధించడం కూడా నగరం లక్ష్యంగా పెట్టుకుంది. నుసంతారాలో జనాభా చాలా తక్కువ. ప్రస్తుతం ఇక్కడ 2 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 8 వేల మంది నిర్మాణ కార్మికులు మాత్రమే నివసిస్తున్నారు. 2030 నాటికి 1.2 మిలియన్ల మందిని ఈ నగరంలో నిర్మించేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్ని అపార్ట్మెంట్లు, మంత్రిత్వ శాఖ భవనాలు, ఆసుపత్రులు, రోడ్లు, నీటి వ్యవస్థలు, విమానాశ్రయం నిర్మించబడినప్పటికీ, నగరంలో ఎక్కువ భాగం ఇంకా నిర్మాణంలో ఉంది.
READ ALSO: H-1B visa: “భారతదేశం అమెరికన్ కలల్ని దొంగిలిస్తోంది”.. ట్రంప్ సర్కార్ ఆరోపణ..
తాజావార్తలు
-
Passport Fee: పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!