Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2027 వన్డే ప్రపంచకప్నకు సిద్ధమయ్యే క్రమంలో భాగంగా టీమిండియా 2026 చివరలో న్యూజీలాండ్లో ఒక భారీ సిరీస్ ఆడనుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య జరిగే ఈ పర్యటనలో మొత్తం 12 మ్యాచ్లు (2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు) జరుగుతాయి. న్యూజీలాండ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ కానుంది. భారత్, న్యూజీలాండ్ దేశాల మధ్య 100 ఏళ్ల క్రీడా సంబంధాల గుర్తుగా ఈ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు.
కోహ్లీ, రోహిత్లకు కీలకమైన సిరీస్
భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (37 ఏళ్లు), రోహిత్ శర్మ (39 ఏళ్లు) తమ కెరీర్ చివరి దశకు చేరుకున్నారు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్లో ఆడటమే వీరి లక్ష్యం. ఈ నేపథ్యంలో ఈ 5 మ్యాచ్ల వన్డే సిరీస్ వారికి చాలా కీలకం కానుంది. న్యూజీలాండ్ లాంటి కఠినమైన పరిస్థితుల్లో వీరు రాణిస్తే, ప్రపంచకప్ జట్టులో వీరి స్థానంపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అవుతాయి. 2025 చివరలో ఆస్ట్రేలియా పర్యటన తరహాలోనే, న్యూజీలాండ్లో కూడా వీరు ఆడబోయే చివరి సిరీస్ ఇదే కావచ్చు.
Also Read
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ వివరాల్లోకి వెళ్తే.. 1వ టీ20: అక్టోబర్ 22 – క్రైస్ట్చర్చ్, 2వ టీ20: అక్టోబర్ 24 – క్రైస్ట్చర్చ్, 3వ టీ20: అక్టోబర్ 27 – వెల్లింగ్టన్, 4వ టీ20: అక్టోబర్ 30 – ఆక్లాండ్, 5వ టీ20: నవంబర్ 1 – హామిల్టన్ లో నిర్వహిస్తారు. ఇక వన్డే సిరీస్ విషయానికి వస్తే.. 1వ వన్డే: నవంబర్ 4 – ఆక్లాండ్, 2వ వన్డే: నవంబర్ 7 – వెల్లింగ్టన్, 3వ వన్డే: నవంబర్ 10 – హామిల్టన్, 4వ వన్డే: నవంబర్ 13 – మౌంట్ మాంగనుయ్, 5వ వన్డే: నవంబర్ 15 – మౌంట్ మాంగనుయ్ లో జరగనుంది. టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే.. 1వ టెస్ట్: నవంబర్ 19 నుండి 23 – వెల్లింగ్టన్, 2వ టెస్ట్: నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 – క్రైస్ట్చర్చ్ లో నిర్వహిస్తారు.
సుదీర్ఘ విరామం తర్వాత 2019-20 సీజన్ తర్వాత భారత్, న్యూజిలాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ వల్ల ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు భారీ ఏర్పాట్లు చేస్తోంది. పంజాబ్లో పుట్టి న్యూజిలాండ్లో పెరిగిన స్పిన్నర్ ఇష్ సోధి ఈ పర్యటన గురించి మాట్లాడుతూ.. భారత జట్టుతో ఆడటం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతి అని, భారత అభిమానులు తెచ్చే ఉత్సాహం మైదానంలో అద్భుతంగా ఉంటుందని అన్నాడు.
తాజావార్తలు
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..