Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2027 వన్డే ప్రపంచకప్నకు సిద్ధమయ్యే క్రమంలో భాగంగా టీమిండియా 2026 చివరలో న్యూజీలాండ్లో ఒక భారీ సిరీస్ ఆడనుంది. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య జరిగే ఈ పర్యటనలో మొత్తం 12 మ్యాచ్లు (2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు) జరుగుతాయి. న్యూజీలాండ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ కానుంది. భారత్, న్యూజీలాండ్ దేశాల మధ్య 100 ఏళ్ల క్రీడా సంబంధాల గుర్తుగా ఈ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు.
కోహ్లీ, రోహిత్లకు కీలకమైన సిరీస్
భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (37 ఏళ్లు), రోహిత్ శర్మ (39 ఏళ్లు) తమ కెరీర్ చివరి దశకు చేరుకున్నారు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్లో ఆడటమే వీరి లక్ష్యం. ఈ నేపథ్యంలో ఈ 5 మ్యాచ్ల వన్డే సిరీస్ వారికి చాలా కీలకం కానుంది. న్యూజీలాండ్ లాంటి కఠినమైన పరిస్థితుల్లో వీరు రాణిస్తే, ప్రపంచకప్ జట్టులో వీరి స్థానంపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అవుతాయి. 2025 చివరలో ఆస్ట్రేలియా పర్యటన తరహాలోనే, న్యూజీలాండ్లో కూడా వీరు ఆడబోయే చివరి సిరీస్ ఇదే కావచ్చు.
Also Read
- Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
- India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
- IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
- Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ వివరాల్లోకి వెళ్తే.. 1వ టీ20: అక్టోబర్ 22 – క్రైస్ట్చర్చ్, 2వ టీ20: అక్టోబర్ 24 – క్రైస్ట్చర్చ్, 3వ టీ20: అక్టోబర్ 27 – వెల్లింగ్టన్, 4వ టీ20: అక్టోబర్ 30 – ఆక్లాండ్, 5వ టీ20: నవంబర్ 1 – హామిల్టన్ లో నిర్వహిస్తారు. ఇక వన్డే సిరీస్ విషయానికి వస్తే.. 1వ వన్డే: నవంబర్ 4 – ఆక్లాండ్, 2వ వన్డే: నవంబర్ 7 – వెల్లింగ్టన్, 3వ వన్డే: నవంబర్ 10 – హామిల్టన్, 4వ వన్డే: నవంబర్ 13 – మౌంట్ మాంగనుయ్, 5వ వన్డే: నవంబర్ 15 – మౌంట్ మాంగనుయ్ లో జరగనుంది. టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే.. 1వ టెస్ట్: నవంబర్ 19 నుండి 23 – వెల్లింగ్టన్, 2వ టెస్ట్: నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 – క్రైస్ట్చర్చ్ లో నిర్వహిస్తారు.
సుదీర్ఘ విరామం తర్వాత 2019-20 సీజన్ తర్వాత భారత్, న్యూజిలాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ వల్ల ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు భారీ ఏర్పాట్లు చేస్తోంది. పంజాబ్లో పుట్టి న్యూజిలాండ్లో పెరిగిన స్పిన్నర్ ఇష్ సోధి ఈ పర్యటన గురించి మాట్లాడుతూ.. భారత జట్టుతో ఆడటం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతి అని, భారత అభిమానులు తెచ్చే ఉత్సాహం మైదానంలో అద్భుతంగా ఉంటుందని అన్నాడు.
తాజావార్తలు
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!