Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: సంక్షేమ పథకాల విషయంలో జనసేన పార్టీకి ఎలాంటి వ్యతిరేకత లేదని ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నిజంగా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వ సహాయం, ఉచిత పథకాలు అవసరమేనని ఆయన పేర్కొన్నారు. అయితే సంక్షేమం పేరుతో మాత్రమే ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదని, ప్రజలు అభివృద్ధిని కూడా కోరుకుంటారని వ్యాఖ్యానించారు.
కేవలం బటన్ నొక్కి నగదు బదిలీలు చేస్తే ప్రజలు ఎప్పటికీ ఓట్లు వేస్తారనే భావన సరికాదని అన్నారు పవన్ కల్యాణ్.. అలాంటి రాజకీయాలకు నిలువెత్తు ఉదాహరణ గత ప్రభుత్వం అని, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కూడా సమానంగా ఉండాలని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం వంటి అంశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని పవన్ విమర్శించారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక వసతులు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
Also Read
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
“ఎంతసేపు బటన్ నొక్కి డబ్బులు పంపించామని చెప్పడం కంటే, ప్రజలు ప్రయాణించే రోడ్లు ఎవరు వేశారు? దశాబ్దాలుగా నిర్మించని రహదారులు ఇప్పుడు ఎలా నిర్మితమయ్యాయి? అనే విషయాలను కూడా చూడాలి” అని అన్నారు పవన్ కల్యాణ్.. ప్రజలకు సంక్షేమం ఎంత అవసరమో, నాణ్యమైన రహదారులు, ఆసుపత్రులు, ఇతర మౌలిక వసతులు కూడా అంతే అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు తమ బాధ్యతగా అభివృద్ధిపై దృష్టి పెట్టకపోతే, ఎన్ని ఉచిత పథకాలు అమలు చేసినా ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందరని పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!