Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Indian Economy India Tops The List Of Countries Where Digital Payment Transactions Are Recorded

Digital Payments: డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ అగ్రస్థానం

Published Date :June 11, 2023 , 11:02 am
By NTV WebDesk
Digital Payments: డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ అగ్రస్థానం
  • Follow Us :
  • google news
  • dailyhunt

2022 ( గతేడాది)లో అత్యధిక డిజిటల్‌ చెల్లింపు లావాదేవీలు నమోదైన దేశాల జాబితాలో భారత దేశం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ మైగవ్‌ఇండియా శనివారం విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడించింది. 2022లో భారత్ 8,950 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్త రియల్‌టైం పేమెంట్స్‌లో మన దేశం వాటా 46 శాతంగా ఉంది. భారత్‌ తరువాత నాలుగు స్థానాల్లో ఉన్న దేశాల మొత్తం లావాదేవీల కంటే అధికం ఇది. డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీల సంఖ్యతో పాటు వాటి విలువపరంగానూ భారత్‌ సరికొత్త రికార్డ్ సృష్టించింది.

Read Also: Sachin Pilot: సచిన్ ఫైలట్ పైనే అందరి దృష్టి.. నేటి సభ పై సర్వత్రా ఉత్కంఠ

Also Read

  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
  • Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
  • Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
  • Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?

భారత్ చెల్లింపుల వ్యవస్థ సమగ్రతతో పాటు డిజిటల్‌ సాంకేతికతపై ప్రజల నుంచి వస్తున్న మద్దతుకు ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో భారత్‌ తొలి స్థానంలో కొనసాగుతోంది. సరికొత్త ఆవిష్కరణలు, దేశం నలుమూలలా వినియోగంతో భారత్‌ నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోందని మైగవ్‌ఇండియా వెల్లడించింది. డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ తర్వాత బ్రెజిల్‌ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. గత ఏడాది ఆ దేశంలో 2,920 కోట్ల లావాదేవీలు జరిగాయి.

Read Also: Kurnool: కర్నూలులో భార్య, అత్తను హతమార్చిన భర్త

రూ. 1,760 కోట్ల లావాదేవీలతో చైనా మూడో స్థానంలో నిలిచింది. థాయ్‌లాండ్‌ (1,650 కోట్ల లావాదేవీలు), దక్షిణ కొరియా (800 కోట్ల లావాదేవీలు) నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయని మైగవ్‌ఇండియా డేటాలో వెల్లడైంది. భారత్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో నెంబర్ వన్ గా ఉంది. మొబైల్‌ డేటా సేవలు అత్యంత చౌకగా లభిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి.. దాంతో దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగంగా పరివర్తనం చెందుతోందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Read Also: Afghanistan Women: దెబ్బతిన్న హస్తకళల మార్కెట్.. ఆఫ్ఘనిస్తాన్‎లో మహిళల ఆందోళన

ప్రధాని మోడీ ప్రభుత్వ హయాంలో డిజిటల్‌ చెల్లింపుల లావాదేవలు 100 రెట్లకు పైగా వృద్ధి చెందాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 127 కోట్ల డిజిటల్‌ చెల్లింపు లావాదేవీలు నమోదు అయ్యాయి.. కాగా.. గత ఆర్థిక సంవత్సరంలో 12,735 కోట్ల లావాదేవీలు జరిగాయి.. ఈ ఏప్రిల్‌లో రూ.14.07 లక్షల కోట్ల విలువైన 889 కోట్ల లావాదేవీలు నమోదుకాగా.. మే నెలలో రూ.14.30 లక్షల కోట్ల విలువైన 941 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అందులో యూపీఐ లావాదేవీల వాటే అధికంగా ఉంది అని మైగవ్‌ఇండియా డేటాలో పేర్కింది.

Read Also: School Bus: నేలకొండపల్లిలో స్కూల్ బస్సు దగ్ధం

ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసిన యూపీఐ అందుబాటులోకి వచ్చాక దేశంలో డిజిటల్‌ చెల్లింపు సేవల వినియోగం అనూహ్యంగా పెరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో రోజువారీ యూపీఐ లావాదేవీలే 100 కోట్లకు పైగా నమోదు కావచ్చని పీడబ్ల్యూసీ రిపోర్టు అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లలో రిటైల్‌ డిజిటల్‌ లావాదేవీల్లో యూపీఐ వాటానే 90 శాతంగా ఉండనుందని నివేదికలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీల వాటానే 8,371 కోట్లుగా ఉండగా.. 2026-27 నాటికి 37,900 కోట్లకు చేరుకోవచ్చని పీడబ్ల్యూసీ అంచనా వేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • countries
  • digital payment transactions
  • digital payments
  • India top
  • recorded

తాజావార్తలు

  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!

  • Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..

  • Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

  • Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!

  • Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions