Sachin Pilot: సచిన్ ఫైలట్ పైనే అందరి దృష్టి.. నేటి సభ పై సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Pilot: రాజస్థాన్లోని దౌసాలో ఆదివారం జరగనున్న సచిన్ పైలట్ కార్యక్రమంపై అందరి దృష్టి ఉంది. జూన్ 11న తన తండ్రి దివంగత రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా పైలట్ తన భవిష్యత్ కార్యాచరణ గురించి పెద్ద ప్రకటన చేయవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. పైలట్ కాంగ్రెస్ను వీడి బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరవచ్చని నిపుణులు సూచించారు. మరో వర్గం రాజకీయ విశ్లేషకులు పైలట్ తన సొంత పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారని, అది రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఆదివారం రాజస్థాన్ రాజకీయాలకు ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చు.
Read Also:Kurnool: కర్నూలులో భార్య, అత్తను హతమార్చిన భర్త
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
పైలట్ కాంగ్రెస్ను విడిచిపెట్టడం లేదని చెప్పే మరో నిపుణుల బృందం వాదిస్తోంది. ఆయన పార్టీలో ఉంటూ సరైన సమయం కోసం ఎదురు చూస్తారని అంటున్నారు. కొత్త పార్టీ రిజిస్ర్టేషన్కు కూడా పైలట్ ఇంకా దరఖాస్తు చేయకపోవడం వీరి వాదనకు బలం చేకూరుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, రాజస్థాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (IAS) ప్రవీణ్ కుమార్ గుప్తా, ఎన్నికల సంఘం సాధారణంగా దరఖాస్తు చేసిన 3-4 నెలల తర్వాత మాత్రమే పార్టీని నమోదు చేస్తుందని పేర్కొన్నాడు. ఎన్నికల విశ్లేషకులు కొత్త పార్టీని స్థాపించడానికి రిజిస్ట్రేషన్ తర్వాత కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల సమయం పడుతుందని సూచిస్తున్నారు. రాజస్థాన్ ఎన్నికలకు చాలా తక్కువ సమయం మిగిలి ఉన్న ఈ పరిస్థితిలో, పైలట్కు కొన్ని నెలల్లో కొత్త పార్టీని స్థాపించడం అంత తేలికైన పని కాదు.
Read Also:Afghanistan Women: దెబ్బతిన్న హస్తకళల మార్కెట్.. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల ఆందోళన
పైలట్ను అంత తేలిగ్గా వదులుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా కనిపించడం లేదు. పైలట్కు చెందిన గుర్జర్ కమ్యూనిటీ రాజస్థాన్లోనే కాకుండా ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్లలో కూడా అనేక స్థానాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అదనంగా, పైలట్కు యువతలో మంచి ఇమేజ్ ఉంది. సీఎం గెహ్లాట్, పైలట్ ఇద్దరినీ కాంగ్రెస్ విలువైన ఆస్తులుగా ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రంధావా అభివర్ణించారు.
- Tags
- bjp
- congress
- Rajasthan
- Sachin Pilot
తాజావార్తలు
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?