G-20 Presidency: జీ-20 కూటమి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G-20 Presidency: భారత్కు విశిష్ట ఘనత దక్కింది. ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు గాంచిన జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది. బలమైన ఆర్థిక వ్యవస్థగా అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్కు ఇటీవల ఇండోనేషియాలోని బాలీలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను బదిలీ చేశారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 1 నుంచి అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఇవాళ భారత్ ఆ బాధ్యతలను స్వీకరించింది. కాగా ఏడాది పాటు ఈ పదవి కొనసాగనుండగా దేశ వ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై రెండు వందల సమావేశాలను నిర్వహించనున్నారు.జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా ప్రత్యేక లోగోను రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు. ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు.
భారతదేశం నేడు అధికారికంగా G20 అధ్యక్ష పదవిని స్వీకరిస్తున్నందున, భారతదేశ చరిత్రను ఇతరులతో పంచుకోవడానికి ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరిగిన యూనివర్శిటీ కనెక్ట్ ప్రోగ్రామ్లో జైశంకర్ మాట్లాడుతూ.. నేటి ప్రపంచం భారతదేశంపై ఎక్కువ ఆసక్తి చూపడానికి చాలా మంచి కారణాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భం ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన విదేశాంగ మంత్రి.. ఇది మరో దౌత్యపరమైన సంఘటనగా పరిగణించాల్సిన పరిణామం కాదని అన్నారు. ఇది కీలకమైన బాధ్యత అని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రపంచంలోని బలహీన వర్గాలను ప్రభావితం చేసే సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలనన్న ఆయన.. సమస్యపై మాత్రమే కాకుండా ఆచరణీయమైన పరిష్కారాలను కనుగొనడంలో కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ యూనివర్శిటీ కనెక్ట్ ఈవెంట్లో దేశంలోని 75 విశ్వవిద్యాలయాల నుండి అగ్రశ్రేణి నాయకులు, పండితులు, విద్యావేత్తలతో పాటు విద్యార్థులు వర్చువల్గా పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో సవాళ్లు ఉన్న సమయంలో ఈ జీ-20 అధ్యక్షత అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
Shraddha Walker Case: అఫ్తాబ్ పూనావాలాకు నార్కో పరీక్ష పూర్తి
నేటి నుంచి జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుంది. 2023 సెప్టెంబర్లో జీ 20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, అమెరికా, బ్రిటన్ జీ 20 సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రపంచంలోని జీడీపీలో జీ 20 దేశాలు 85 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, జనాభాలో మూడింట రెండు వంతులు జీ 20 దేశాల్లోనే ఉన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!