Shraddha Walker Case: అఫ్తాబ్ పూనావాలాకు నార్కో పరీక్ష పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Walker Case: తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్ను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ గురువారం ఢిల్లీలో రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో నిర్వహించారు. ఢిల్లీ పోలీసుల బందోబస్తు నడుమ ఈ పరీక్షను నిర్వహించారు. ఢిల్లీ కోర్టు విశ్లేషణకు అనుమతి ఇవ్వడంతో అఫ్తాబ్ను నార్కో పరీక్ష కోసం ఉదయం 9 గంటలకు తీహార్ జైలు నుంచి ఢిల్లీ పోలీసులు రోహిణిలో గల బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
నార్కో అనాలిసిస్ పరీక్ష చేసేముందు అఫ్తాబ్కు రక్తపోటు, పల్స్ రేటు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందనలను తనిఖీ చేసే సాధారణ పరీక్షలను నిర్వహించారు. అనంతరం అతను నార్కో పరీక్షకు అంగీకరిస్తూ సమ్మతి పత్రంపై సంతకం చేశాడు. ఆ తర్వాత అఫ్తాబ్కు అనస్థీషియా ఇచ్చారు. అనంతరం నార్కో పరీక్షను చేపట్టారు. ఫోటో నిపుణుడు, ఫోరెన్సిక్ సైకాలజీ నిపుణుడు, ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుడు, నోడల్ ఆఫీసర్, నార్కో, అంబేద్కర్ హాస్పిటల్తో కూడిన ఎఫ్ఎస్ఎల్ అధికారుల బృందం నార్కో పరీక్షను నిర్వహించింది. అఫ్తాబ్ నార్కో పరీక్ష 11.45 గంటలకు ముగిసింది. ఆ తర్వాత అతను వైద్యుల పరిశీలనలో ఉంచబడడంతో పాటు అతనికి మానసిక చికిత్స అందించారు. అఫ్తాబ్కు పూర్తి స్పృహ వచ్చిన తర్వాత ఢిల్లీ పోలీసు బృందం అతడిని పూర్తి భద్రతతో తీహార్కు తీసుకెళ్లింది.
Also Read
- Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
Drunk SI: తప్పతాగి పక్కింటికి వెళ్లిన ఎస్ఐ.. చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు
సోమవారం అఫ్తాబ్ ప్రయాణిస్తున్న పోలీసు వ్యాన్పై కొందరు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 365, 302, 201 కింద మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితుడైన అఫ్తాబ్ నార్కో పరీక్ష ఈ ఉదయం ప్రారంభమైందని ఐపీఎస్, స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. అంతకుముందు దేశ రాజధానిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కార్యాలయంలో నిర్వహించిన పాలిగ్రాఫ్ పరీక్షలో.. ఈ ఏడాది మేలో శ్రద్ధాను చంపి, ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా నరికివేసినట్లు ఆఫ్తాబ్ అంగీకరించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తరిగిన శరీర భాగాలను రిఫ్రిజిరేటర్లో భద్రపరిచి క్రమంగా పారవేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.నిందితుడు ప్రశ్నలకు తప్పుదోవ పట్టించే సమాధానాలు చెబుతున్నాడని ఢిల్లీ పోలీసులు సమర్పించిన తర్వాత ఆఫ్తాబ్పై పాలిగ్రాఫ్ పరీక్ష, నార్కో విశ్లేషణ నిర్వహించడానికి ఢిల్లీ కోర్టు పోలీసులను అనుమతించింది.
తాజావార్తలు
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!