Shraddha Walker Case: అఫ్తాబ్ పూనావాలాకు నార్కో పరీక్ష పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Walker Case: తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్ను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ గురువారం ఢిల్లీలో రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో నిర్వహించారు. ఢిల్లీ పోలీసుల బందోబస్తు నడుమ ఈ పరీక్షను నిర్వహించారు. ఢిల్లీ కోర్టు విశ్లేషణకు అనుమతి ఇవ్వడంతో అఫ్తాబ్ను నార్కో పరీక్ష కోసం ఉదయం 9 గంటలకు తీహార్ జైలు నుంచి ఢిల్లీ పోలీసులు రోహిణిలో గల బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
నార్కో అనాలిసిస్ పరీక్ష చేసేముందు అఫ్తాబ్కు రక్తపోటు, పల్స్ రేటు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందనలను తనిఖీ చేసే సాధారణ పరీక్షలను నిర్వహించారు. అనంతరం అతను నార్కో పరీక్షకు అంగీకరిస్తూ సమ్మతి పత్రంపై సంతకం చేశాడు. ఆ తర్వాత అఫ్తాబ్కు అనస్థీషియా ఇచ్చారు. అనంతరం నార్కో పరీక్షను చేపట్టారు. ఫోటో నిపుణుడు, ఫోరెన్సిక్ సైకాలజీ నిపుణుడు, ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుడు, నోడల్ ఆఫీసర్, నార్కో, అంబేద్కర్ హాస్పిటల్తో కూడిన ఎఫ్ఎస్ఎల్ అధికారుల బృందం నార్కో పరీక్షను నిర్వహించింది. అఫ్తాబ్ నార్కో పరీక్ష 11.45 గంటలకు ముగిసింది. ఆ తర్వాత అతను వైద్యుల పరిశీలనలో ఉంచబడడంతో పాటు అతనికి మానసిక చికిత్స అందించారు. అఫ్తాబ్కు పూర్తి స్పృహ వచ్చిన తర్వాత ఢిల్లీ పోలీసు బృందం అతడిని పూర్తి భద్రతతో తీహార్కు తీసుకెళ్లింది.
Also Read
- Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
Drunk SI: తప్పతాగి పక్కింటికి వెళ్లిన ఎస్ఐ.. చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు
సోమవారం అఫ్తాబ్ ప్రయాణిస్తున్న పోలీసు వ్యాన్పై కొందరు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 365, 302, 201 కింద మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితుడైన అఫ్తాబ్ నార్కో పరీక్ష ఈ ఉదయం ప్రారంభమైందని ఐపీఎస్, స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా తెలిపారు. అంతకుముందు దేశ రాజధానిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కార్యాలయంలో నిర్వహించిన పాలిగ్రాఫ్ పరీక్షలో.. ఈ ఏడాది మేలో శ్రద్ధాను చంపి, ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా నరికివేసినట్లు ఆఫ్తాబ్ అంగీకరించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తరిగిన శరీర భాగాలను రిఫ్రిజిరేటర్లో భద్రపరిచి క్రమంగా పారవేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.నిందితుడు ప్రశ్నలకు తప్పుదోవ పట్టించే సమాధానాలు చెబుతున్నాడని ఢిల్లీ పోలీసులు సమర్పించిన తర్వాత ఆఫ్తాబ్పై పాలిగ్రాఫ్ పరీక్ష, నార్కో విశ్లేషణ నిర్వహించడానికి ఢిల్లీ కోర్టు పోలీసులను అనుమతించింది.
తాజావార్తలు
-
HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!