IndvsPak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారత ఇన్సింగ్స్ తర్వాత ప్రారంభమైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో ఫీల్డ్ ఎంపైర్లు మ్యాచ్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అంతకు ముందు పల్లెకెలె వేదికగా పాకిస్తాన్తో జరుగిన హైఓల్టేజీ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా.. పాక్ బౌలర్ల ధాటికి చతికిలపడింది. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసిమ్ షా నిప్పులు చెరిగే బంతులు విసరడంతో 266 పరుగులకే భారత జట్టు కుప్పకూలిపోయింది.
Read Also: AP CM Jagan London Tour: లండన్ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్
Also Read
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 48.5 ఓవర్లలో 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాని ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా కలిసి ఆదుకున్నారు. చివర్లో జస్ప్రిత్ బుమ్రా కూడా 16 పరుగులు చేయడంతో టీమిండియా… గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. 53 బంతుల్లో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేయగా.. వన్డేల్లో ఇషాన్ కిషన్కి ఇది ఏడో హాఫ్ సెంచరీ కాగా మిడిల్ ఆర్డర్లో మొట్టమొదటిది.. ఇంతకు ముందు ఇషాన్ కిషన్ చేసిన 6 వన్డే హాఫ్ సెంచరీలు కూడా ఓపెనర్గా చేసినవే.. 82 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఆసియా కప్లో పాకిస్తాన్పై అత్యధిక స్కోరు బాదిన భారత వికెట్ కీపర్గా నిలిచాడు. ఇంతకు ముందు 2008 ఆసియా కప్లో ధోనీ 76 పరుగులు చేయడమే ఆసియా కప్లో భారత వికెట్ కీపర్కి అత్యధిక స్కోరుగా ఉంది.
Read Also: Samantha: సమంత.. రేణు దేశాయ్ లా మారుతుందా..?
హార్ధిక్ పాండ్యా (90 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 87 పరుగులు ) హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వన్డేల్లో హార్ధిక్ పాండ్యాకి ఇది 11వ హాఫ్ సెంచరీ.. కాగా.. హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ కలిసి ఐదో వికెట్కి 138 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఐదో వికెట్కి టీమిండియా తరుపున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇషాన్ కిషన్, హారీస్ రౌఫ్ బౌలింగ్లో బాబర్ ఆజమ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా.. ఇక, హార్ధిక్ పాండ్యా, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్లో అఘా సల్మాన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. పాండ్యా అవుటైన ఓవర్లోనే రవీంద్ర జడేజా కూడా డగౌట్ బాట పట్టాడు. శార్థల్ ఠాకూర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
Read Also: India vs Pakistan LIVE Score, Asia Cup 2023: భారత్-పాక్ మ్యాచ్ రద్దు
టీమిండియా 242 పరుగులకే 8 వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ కలిసి 9 వ వికెట్కి 19 రన్స్ జోడించారు. 13 బంతుల్లో 4 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్, నసీం షా బౌలింగ్లో రిజ్వాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. ఇక, 14 బంతుల్లో 3 ఫోర్లతో 16 రన్స్ చేసిన జస్ప్రిత్ బుమ్రా, నసీం షా బౌలింగ్లో సిక్సర్కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. పాక్ బౌలర్లలో షాహీన్ షా ఆఫ్రిదీకి 4 వికెట్లు దక్కగా.. హారీస్ రౌఫ్ 3 వికెట్లు.. నసీం షాకి 3 వికెట్లు తీసుకున్నారు.
తాజావార్తలు
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!