Cyber Crime: పెరిగిన సైబర్ దాడులు.. రూ.10వేల కోట్లకు పైగా స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు రూ. 10319 కోట్ల మొత్తాన్ని వారు కొట్టేశారు. ఈ విషయాన్ని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలిపింది. బాధితులు కోల్పోయిన మొత్తంలో 1,127 కోట్ల రూపాయలను సక్సెస్ ఫుల్ గా నిలిపివేసినట్లు ఐ4సీ డైరెక్టర్ రాజేశ్ కుమార్ వెల్లడించారు. దీంతో 9 నుంచి 10 శాతం సొమ్మును బాధితుల ఖాతాల్లోకి తిరిగి జమ చేసినట్లు పేర్కొన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)లో 2021లో 4. 52 లక్షలకు పైగా నేరాలు రికార్డ్ అయినట్లు తెలిపారు.
Read Also: Bandi Sanjay: బండి సంజయ్కి BJP కీలక బాధ్యతలు.. కిసాన్ మోర్చా ఇంఛార్జ్గా నియామకం
Also Read
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
కాగా, 2022లో కేసుల సంఖ్యలో 113.7 శాతం పెరుగుదలతో 9. 66 లక్షలకు చేరింది. ఇక, 2023లో ఏకంగా 15. 56 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు 129 సైబర్ కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 50 శాతం సైబర్ దాడులు కంబోడియా, వియత్నాం, చైనా తదితర దేశాల నుంచే జరిగినట్లు ఐ4సీ వెల్లడించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి పని చేసే వారు ఆన్లైన్ బుకింగ్, ఓఎల్ఎక్స్ లాంటి మార్గాల ద్వారా ఎక్కువగా ఈ మోసాలు జరిగాయి.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
అలాగే, ఈ-కేవైసీ గడువు ముగింపు, మాల్వేర్ వాడడం ద్వారా ఝార్ఖండ్ ముఠాలు ఎక్కువ మందిని బురిడీ కొట్టించాయి. సైబర్ బాధితులు తమ డబ్బును ఈజీగా క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తోంది.. వాటిని త్వరలోనే అమల్లోకి తీసుకు వస్తామని ఐ4సీ డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం బాధితులు తమ డబ్బును తిరిగి పొందాలంటే కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకురావాల్సి ఉందన్నారు.
తాజావార్తలు
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!