No Confidence Motion: కాంగ్రెస్పై భారత్కు అవిశ్వాసం ఉంది.. ప్రధాని మోడీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Confidence Motion: ప్రధాని మోదీ గురువారం కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని అవమానించడంలో ఆ పార్టీ ఆనందం పొందుతుందని అన్నారు. ఆ పార్టీ ఏ చిన్న సమస్యనైనా తీసుకుంటుందని, భారతదేశాన్ని పరువు తీయడానికి విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్పై విరుచుకుపడిన ప్రధాని మోదీ.. ఆ పార్టీపై భారత ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు. పార్టీ అహంకారంతో నిండిపోయిందన్నారు. తమిళనాడులో చివరిసారిగా 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. అప్పటి నుంచి ఆ రాష్ట్రం గ్రాండ్ ఓల్డ్ పార్టీపై అవిశ్వాసం చూపిందని ఆయన అన్నారు. జులైలో బెంగళూరులో యూపీఏ కూటమికి అంత్యక్రియలు నిర్వహించామని, కొత్తగా ఏర్పాటు చేసిన 26 ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమిపై పీఎం మోడీ మండిపడ్డారు. కూటమి పేరు మార్చడం ద్వారా తాము అధికారంలోకి వస్తామని వారు భావిస్తున్నారని ఆయన చెప్పారు.
Also Read: PM Modi: విపక్షాలకు ప్రధాని ధన్యవాదాలు.. 2028లో మరో అవిశ్వాస తీర్మానమంటూ జోస్యం
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ ఉగ్రదాడులు జరిగాయని.. పాకిస్థాన్ చెప్పేదే విపక్షాలు నమ్ముతున్నాయని ఆయన ఆరోపించారు. విపక్షాలకు పాకిస్థాన్ అంటే ప్రేమ కనిపిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. 2028లో కూడా తమపై విపక్షాలు అవిశ్వాసం పెడతాయని ప్రధాని జోస్యం చెప్పారు. కశ్మీర్ పౌరులపై కాంగ్రెస్కు నమ్మకం లేదని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించలేదని మోడీ వెల్లడించారు. మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్ వచ్చినా విపక్షాలు విశ్వసించలేదని ప్రధాని మోడీ లోక్సభలో మండిపడ్డారు. పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ జరిపిన సైన్యాన్ని విపక్షాలు నమ్మలేదంటూ ప్రధాని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో స్కీమ్లు లేవు.. అన్ని స్కామ్లేనంటూ ప్రధాని విమర్శలు గుప్పించారు. మొదటి నుంచి కాంగ్రెస్లో ఏదీ తమ సొంతం కాదంటూ మోడీ చెప్పుకొచ్చారు. పార్టీ జెండాలో త్రివర్ణ పతాకాన్ని చేర్చారని.. అందుకే ప్రజలను తమవైపుకు లాక్కునేవారని.. తమ జెండాగా జనం లాక్కునేవారని.. గాంధీ అనే పేరును దోచుకున్నారని.. కాంగ్రెస్కు కుటుంబ పాలన, దర్బార్ పాలన అంటేనే ఇష్టమని మోడీ విమర్శించారు.
Also Read: Karnataka: వాహనదారులకు శుభవార్త.. చలాన్లపై 50 శాతం రాయితీ
వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రధాని మోదీ జాబితా చేశారు. పార్టీపై ప్రజలకు విశ్వాసం లేదని చెప్పారు. తమిళనాడులో 1962లో కాంగ్రెస్ గెలిచిందని, 1962 నుంచి తమిళనాడు ప్రజలు కాంగ్రెస్ వద్దు అంటున్నారని.. పశ్చిమ బెంగాల్లో 1972లో కాంగ్రెస్ గెలిచిందని, పశ్చిమ బెంగాల్ ప్రజలు కూడా వద్దు అన్నారని ఆయన చెప్పారు. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ లేదన్నారు. 1985లో యూపీ, బీహార్, గుజరాత్లలో గెలిచారని, ఈ రాష్ట్రాల ప్రజలు కూడా కాంగ్రెస్ వద్దు అంటున్నారని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల అహంకార ధోరణి వల్ల 400 సీట్ల నుంచి 40 సీట్లకు పడిపోయారని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు తనపై మక్కువ చూపుతున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘పార్లమెంటులో తాను ప్రసంగిస్తున్నప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగినా దాన్ని సమస్యగా మార్చుకునేలా వారి ప్రేమ ఉంది’ అని ఆయన అన్నారు. వారు 24 గంటలూ మోడీ కలలే కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ది అబద్ధాల దుకాణమని.. ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అమ్ముకుందని ఆయన అన్నారు. విపక్ష కూటమి త్వరలోనే విడిపోతుందని ప్రధాని చెప్పారు. వాళ్ల కొత్త దుకాణానికి త్వరలోనే తాళాలు వేయాల్సి వస్తుందన్నారు. ప్రధాని కావాలనే కోరిక ఇండియా కూటమిలో అందరికీ ఉందన్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!