Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story India Has No Confidence Against Congress Says Pm Modi

No Confidence Motion: కాంగ్రెస్‌పై భారత్‌కు అవిశ్వాసం ఉంది.. ప్రధాని మోడీ ఫైర్

Published Date :August 10, 2023 , 6:45 pm
By Mahesh Jakki
No Confidence Motion: కాంగ్రెస్‌పై భారత్‌కు అవిశ్వాసం ఉంది.. ప్రధాని మోడీ ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

No Confidence Motion: ప్రధాని మోదీ గురువారం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని అవమానించడంలో ఆ పార్టీ ఆనందం పొందుతుందని అన్నారు. ఆ పార్టీ ఏ చిన్న సమస్యనైనా తీసుకుంటుందని, భారతదేశాన్ని పరువు తీయడానికి విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోదీ.. ఆ పార్టీపై భారత ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు. పార్టీ అహంకారంతో నిండిపోయిందన్నారు. తమిళనాడులో చివరిసారిగా 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. అప్పటి నుంచి ఆ రాష్ట్రం గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీపై అవిశ్వాసం చూపిందని ఆయన అన్నారు. జులైలో బెంగళూరులో యూపీఏ కూటమికి అంత్యక్రియలు నిర్వహించామని, కొత్తగా ఏర్పాటు చేసిన 26 ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమిపై పీఎం మోడీ మండిపడ్డారు. కూటమి పేరు మార్చడం ద్వారా తాము అధికారంలోకి వస్తామని వారు భావిస్తున్నారని ఆయన చెప్పారు.

Also Read: PM Modi: విపక్షాలకు ప్రధాని ధన్యవాదాలు.. 2028లో మరో అవిశ్వాస తీర్మానమంటూ జోస్యం

కాంగ్రెస్‌ పాలనలోనే ఎక్కువ ఉగ్రదాడులు జరిగాయని.. పాకిస్థాన్‌ చెప్పేదే విపక్షాలు నమ్ముతున్నాయని ఆయన ఆరోపించారు. విపక్షాలకు పాకిస్థాన్‌ అంటే ప్రేమ కనిపిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. 2028లో కూడా తమపై విపక్షాలు అవిశ్వాసం పెడతాయని ప్రధాని జోస్యం చెప్పారు. కశ్మీర్‌ పౌరులపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించలేదని మోడీ వెల్లడించారు. మేడిన్‌ ఇండియా కరోనా వ్యాక్సిన్‌ వచ్చినా విపక్షాలు విశ్వసించలేదని ప్రధాని మోడీ లోక్‌సభలో మండిపడ్డారు. పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ జరిపిన సైన్యాన్ని విపక్షాలు నమ్మలేదంటూ ప్రధాని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో స్కీమ్‌లు లేవు.. అన్ని స్కామ్‌లేనంటూ ప్రధాని విమర్శలు గుప్పించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఏదీ తమ సొంతం కాదంటూ మోడీ చెప్పుకొచ్చారు. పార్టీ జెండాలో త్రివర్ణ పతాకాన్ని చేర్చారని.. అందుకే ప్రజలను తమవైపుకు లాక్కునేవారని.. తమ జెండాగా జనం లాక్కునేవారని.. గాంధీ అనే పేరును దోచుకున్నారని.. కాంగ్రెస్‌కు కుటుంబ పాలన, దర్బార్‌ పాలన అంటేనే ఇష్టమని మోడీ విమర్శించారు.

Also Read: Karnataka: వాహనదారులకు శుభవార్త.. చలాన్లపై 50 శాతం రాయితీ

వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రధాని మోదీ జాబితా చేశారు. పార్టీపై ప్రజలకు విశ్వాసం లేదని చెప్పారు. తమిళనాడులో 1962లో కాంగ్రెస్‌ గెలిచిందని, 1962 నుంచి తమిళనాడు ప్రజలు కాంగ్రెస్‌ వద్దు అంటున్నారని.. పశ్చిమ బెంగాల్‌లో 1972లో కాంగ్రెస్ గెలిచిందని, పశ్చిమ బెంగాల్‌ ప్రజలు కూడా వద్దు అన్నారని ఆయన చెప్పారు. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్‌ లేదన్నారు. 1985లో యూపీ, బీహార్‌, గుజరాత్‌లలో గెలిచారని, ఈ రాష్ట్రాల ప్రజలు కూడా కాంగ్రెస్‌ వద్దు అంటున్నారని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల అహంకార ధోరణి వల్ల 400 సీట్ల నుంచి 40 సీట్లకు పడిపోయారని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు తనపై మక్కువ చూపుతున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘పార్లమెంటులో తాను ప్రసంగిస్తున్నప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగినా దాన్ని సమస్యగా మార్చుకునేలా వారి ప్రేమ ఉంది’ అని ఆయన అన్నారు. వారు 24 గంటలూ మోడీ కలలే కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ది అబద్ధాల దుకాణమని.. ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అమ్ముకుందని ఆయన అన్నారు. విపక్ష కూటమి త్వరలోనే విడిపోతుందని ప్రధాని చెప్పారు. వాళ్ల కొత్త దుకాణానికి త్వరలోనే తాళాలు వేయాల్సి వస్తుందన్నారు. ప్రధాని కావాలనే కోరిక ఇండియా కూటమిలో అందరికీ ఉందన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Lok Sabha
  • no-confidence motion
  • opposition
  • Parliament

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions