India Defense Industry: చరిత్ర సృష్టించిన భారత్.. రక్షణ ఉత్పత్తిలో ఇండియా నయా రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Defense Industry: భారతదేశం చరిత్ర సృష్టించింది. వాస్తవానికి ఒకప్పుడు ఇండియా తన చిన్న చిన్న సైనిక అవసరాలకు కూడా విదేశాల వైపు చూసేది. సూదుల నుంచి ఓడల వరకు ప్రతిదీ దిగుమతి చేసుకోవడం అప్పుడు తప్పనిసరి పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు భారతదేశం ప్రస్థానం ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణ. ప్రపంచ దేశాలకు ఇండియా బలమైన భద్రతా భాగస్వామిగా ఉద్భవించింది. దీనికి నిదర్శనంగా తాజా డేటా నిలుస్తుంది. రక్షణ ఉత్పత్తి, ఎగుమతులలో భారతదేశం కొత్త చరిత్ర సృష్టించింది. ఈ వార్తలు కేవలం గణాంకాల గురించి మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంపై ఉన్న నమ్మకానికి, దేశంలో సృష్టిస్తున్న కొత్త ఉపాధి అవకాశాల గురించి..
READ ALSO: Ambati Rambabu: చంద్రబాబు సీఎం కావడానికి కాపులే కారణం!
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
రికార్డు స్థాయిలో రక్షణ ఉత్పత్తులు..
ప్రభుత్వం చేపట్టిన “ఆత్మనిర్భర్ భారత్” చొరవ ఇప్పుడు క్షేత్రస్థాయిలో గొప్ప ప్రభావాన్ని చూపుతోంది. భారతదేశ రక్షణ ఉత్పత్తి 2024-25లో రికార్డు స్థాయిలో ₹1.54 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ఇప్పటివరకు అత్యధికం. వెనక్కి తిరిగి చూసుకుంటే 2014-15తో పోలిస్తే 2023-24లో దేశీయ రక్షణ ఉత్పత్తి 174% భారీగా పెరుగుతుందని రక్షణ వర్గాల అంచనా. ఉత్పత్తిలోనే కాదు భారతదేశం తన వస్తువులను అమ్మడంలో కూడా గొప్ప పురోగతిని సాధించింది. 2014లో దేశ రక్షణ ఎగుమతులు రూ.1,000 కోట్ల కంటే తక్కువగా ఉండగా, ఇప్పుడు అవి రూ.23,622 కోట్లకు పెరిగాయి. నేడు భారతదేశ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, రాడార్లు, బ్రహ్మోస్ వంటి క్షిపణులు ప్రపంచవ్యాప్తంగా 80 కి పైగా దేశాల భద్రతలో భాగంగా ఉన్నాయి.
ఈ విజయం కేవలం పెద్ద ప్రభుత్వ సంస్థలచే మాత్రమే కాకుండా, దేశంలోని చిన్న, మధ్య తరహా సంస్థల (MSMEలు) ద్వారా భాగస్వామ్యంతో సాధ్యమైంది. నేడు 16 వేల కంటే ఎక్కువ MSMEలు రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు 462 కంపెనీలకు ఆయుధాలు, పరికరాలను తయారు చేయడానికి 788 పారిశ్రామిక లైసెన్సులను జారీ చేసింది. విధాన మార్పులు ఈ మార్గాన్ని సులభతరం చేశాయి.
* DAP 2020, DPM 2025 వంటి సంస్కరణలు సైనిక కొనుగోళ్లను పారదర్శకంగా, డిజిటల్గా మార్చాయి.
* ఉత్తరప్రదేశ్, తమిళనాడులలో నిర్మిస్తున్న డిఫెన్స్ కారిడార్లో ఇప్పటివరకు ₹9,145 కోట్ల పెట్టుబడి పెట్టారు.
* ఇది భవిష్యత్తులో ₹66,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన అవకాశాలను సృష్టిస్తుంది, అలాగే స్థానిక స్థాయిలో ఉపాధి, వ్యాపారాన్ని పెంచుతుంది.
మన పన్నుల డబ్బులు ఇప్పుడు విదేశీ కంపెనీల ఖజానాను నింపడం కంటే మన స్వంత పరిశ్రమలను బలోపేతం చేస్తున్నాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. 2024-25లో రక్షణ మంత్రిత్వ శాఖ 193 ప్రధాన ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ ఒప్పందం విలువ మొత్తం ₹2.09 లక్షల కోట్లు. ముఖ్యంగా ఈ ఒప్పందాలలో 177 భారతీయ కంపెనీలు ఉన్నాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళాన్ని ఆధునీకరించడానికి ప్రభుత్వం ఖజానాను తెరిచింది. అది T-90 ట్యాంకుల ఇంజిన్లు అయినా, వరుణాస్త్ర టార్పెడోలు అయినా, లేదా వైమానిక దళం కోసం కొత్త రాడార్లు అయినా, అన్నీ ఇప్పుడు భారతదేశంలోనే తయారు అవుతున్నాయి. 2025-26 సంవత్సరానికి రక్షణ బడ్జెట్ను ₹6.81 లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచింది. భద్రత, స్వదేశీకరణ అనే దానికి ప్రభుత్వం ప్రాధాన్యతలని ఈ విషయాల ద్వారా స్పష్టంగా అర్థం అవుతుంది.
READ ALSO: Karnataka CM Change: హస్తీనకు కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ..
తాజావార్తలు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
-
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
-
Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
-
Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!