India’s Big Sports Day: క్రికెట్లో పాక్.. హాకీలో చైనా.. సూపర్ సండే రోజు భారత్కు డబుల్ ‘పరీక్ష’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s Big Sports Day: క్రీడా ప్రియులకు ఆదివారం ఒక పండగే. ఎందుకంటే.. రేపు భారత్ రెండు వేర్వేరు శత్రు దేశాల జట్లతో తలపడనుంది. ఒక వైపు, దుబాయ్లో జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లో టీం ఇండియా పాకిస్థాన్తో తలపడనుంది. మరోవైపు, మహిళల హాకీ ఆసియా కప్ టైటిల్ పోరు హాంగ్జౌ గడ్డపై జరుగుతుంది. భారత హాకీ జట్టు ఆతిథ్యం ఇచ్చిన చైనాతో తలపడనుంది. క్రికెట్, హాకీ రెండు వేర్వేరు ఆటలు అయినప్పటికీ.. ఆసియాలోని రెండు చారిత్రాత్మక ప్రత్యర్థుల మధ్య ఓకే రోజు ఆట ఉత్సాహభరితంగా మారునుంది. ఈ జట్లు తుఫానును సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచ్పై అందరి దృష్టి ఉంది.
READ MORE: PM Modi: గోవులు జంతువుల్లా కనిపించవు..”జంతు ప్రేమికుల”పై ప్రధాని సెటైర్లు..
Also Read
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
దుబాయ్ మైదానంలో భారత్- పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. రెండు దేశాల జట్లు మొదటిసారిగా తలపడుతున్నందున ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనదిగా పరిగిణిస్తున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణపై వ్యతిరేకత సైతం తారాస్థాయికి చేరుకుంది. అయినప్పటికీ.. ఎప్పటిలాగే ఉత్సాహం మాత్రం తగ్గదు. ఆదివారం రాత్రి 8 గంటలకు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు దేశాలు T20 మ్యాచ్లలో 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 9 సార్లు గెలవగా.. పాక్ 3 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై అయింది. ఆ మ్యాచ్లో భారత్ బాల్ అవుట్ రూల్ ద్వారా గెలిచింది. ఆసియా కప్ లోనూ భారత్దే పైచేయి. రెండు జట్లు టీ20 ఫార్మాట్ లో 3 సార్లు తలపడ్డాయి. భారత్ 2 సార్లు గెలిచింది.
READ MORE: Manchu Manoj: 12 ఏళ్ల తర్వాత సక్సెస్.. కలలా ఉందంటూ మంచు మనోజ్ ఎమోషనల్!
మహిళల హాకీ ఆసియా కప్ ఫైనల్లో చైనా, భారత్ తలపడనున్నాయి. భారత మహిళా హాకీ జట్టు జపాన్తో 1-1తో డ్రాగా ముగిసింది. భారత జట్టు దృష్టి చైనా, కొరియా మధ్య జరిగే మ్యాచ్పై పడింది. ఈ మ్యాచ్లో సూపర్ 4 దశలోని చివరి మ్యాచ్లో కొరియాను 1-0 తేడాతో ఓడించి ఆతిథ్య జట్టు చైనా ఫైనల్లోకి ప్రవేశించింది. కొరియా ఓటమితో భారత జట్టు ఫైనల్కు టికెట్ ఖరారైంది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచ కప్కు అర్హత సాధిస్తారు. ఇప్పటికే.. భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ ఫైనల్లో ఘన విజయం సాధించింది.
తాజావార్తలు
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!