India’s Big Sports Day: క్రికెట్లో పాక్.. హాకీలో చైనా.. సూపర్ సండే రోజు భారత్కు డబుల్ ‘పరీక్ష’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s Big Sports Day: క్రీడా ప్రియులకు ఆదివారం ఒక పండగే. ఎందుకంటే.. రేపు భారత్ రెండు వేర్వేరు శత్రు దేశాల జట్లతో తలపడనుంది. ఒక వైపు, దుబాయ్లో జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లో టీం ఇండియా పాకిస్థాన్తో తలపడనుంది. మరోవైపు, మహిళల హాకీ ఆసియా కప్ టైటిల్ పోరు హాంగ్జౌ గడ్డపై జరుగుతుంది. భారత హాకీ జట్టు ఆతిథ్యం ఇచ్చిన చైనాతో తలపడనుంది. క్రికెట్, హాకీ రెండు వేర్వేరు ఆటలు అయినప్పటికీ.. ఆసియాలోని రెండు చారిత్రాత్మక ప్రత్యర్థుల మధ్య ఓకే రోజు ఆట ఉత్సాహభరితంగా మారునుంది. ఈ జట్లు తుఫానును సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచ్పై అందరి దృష్టి ఉంది.
READ MORE: PM Modi: గోవులు జంతువుల్లా కనిపించవు..”జంతు ప్రేమికుల”పై ప్రధాని సెటైర్లు..
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
దుబాయ్ మైదానంలో భారత్- పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. రెండు దేశాల జట్లు మొదటిసారిగా తలపడుతున్నందున ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనదిగా పరిగిణిస్తున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణపై వ్యతిరేకత సైతం తారాస్థాయికి చేరుకుంది. అయినప్పటికీ.. ఎప్పటిలాగే ఉత్సాహం మాత్రం తగ్గదు. ఆదివారం రాత్రి 8 గంటలకు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు దేశాలు T20 మ్యాచ్లలో 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 9 సార్లు గెలవగా.. పాక్ 3 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై అయింది. ఆ మ్యాచ్లో భారత్ బాల్ అవుట్ రూల్ ద్వారా గెలిచింది. ఆసియా కప్ లోనూ భారత్దే పైచేయి. రెండు జట్లు టీ20 ఫార్మాట్ లో 3 సార్లు తలపడ్డాయి. భారత్ 2 సార్లు గెలిచింది.
READ MORE: Manchu Manoj: 12 ఏళ్ల తర్వాత సక్సెస్.. కలలా ఉందంటూ మంచు మనోజ్ ఎమోషనల్!
మహిళల హాకీ ఆసియా కప్ ఫైనల్లో చైనా, భారత్ తలపడనున్నాయి. భారత మహిళా హాకీ జట్టు జపాన్తో 1-1తో డ్రాగా ముగిసింది. భారత జట్టు దృష్టి చైనా, కొరియా మధ్య జరిగే మ్యాచ్పై పడింది. ఈ మ్యాచ్లో సూపర్ 4 దశలోని చివరి మ్యాచ్లో కొరియాను 1-0 తేడాతో ఓడించి ఆతిథ్య జట్టు చైనా ఫైనల్లోకి ప్రవేశించింది. కొరియా ఓటమితో భారత జట్టు ఫైనల్కు టికెట్ ఖరారైంది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచ కప్కు అర్హత సాధిస్తారు. ఇప్పటికే.. భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ ఫైనల్లో ఘన విజయం సాధించింది.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..