SA vs IND: డర్బన్లో సంజు ధమాకా.. తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SA vs IND: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డర్బన్లో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా ఆడుతున్న టీమ్ ఇండియా స్కోరు బోర్డుపై 202 పరుగులు చేయగా ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 141 పరుగులకే ఆలౌట్ అయింది. సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగిపోయారు. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిల బౌలింగ్ భారత జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాయి. శాంసన్ 107 పరుగులు చేయగా, బిష్ణోయ్, చక్రవర్తి చెరో మూడు వికెట్లు తీశారు.
టాస్ ఓడిన భారత జట్టును తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించారు. అభిషేక్ శర్మ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు, కానీ సంజూ శాంసన్ వరుసగా రెండో టీ20 మ్యాచ్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగులతో చెలరేగిపోయాడు. తిలక్ వర్మ 18 బంతుల్లో 33 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడి భారత స్కోరును 200 దాటి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. భారత ఇన్నింగ్స్లో పాట్రిక్ క్రూగర్ వేసిన 11 బంతుల ఓవర్ చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
Read Also:Deputy CM Bhatti Vikramarka: నేటి నుంచి ఇంటింటి సర్వే.. వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం..
సొంతగడ్డపై 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ కేవలం 8 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆతిథ్య జట్టు స్కోరు 44 వద్ద ఉన్న సమయానికి ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ల వికెట్లను కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు, కానీ వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో ఇద్దరినీ అవుట్ చేసి ఆఫ్రికన్ జట్టును పెద్ద దెబ్బ తీశాడు.
చివరి 5 ఓవర్లలో భారత జట్టు సరిగా బ్యాటింగ్ చేయలేకపోయినప్పటికీ, బౌలర్లు దానిని భర్తీ చేశారు. దక్షిణాఫ్రికా తొలి నుంచి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. స్కోరు 44 పరుగులకే ఆతిథ్య జట్టు 3 వికెట్లు పడగా, స్కోరు 93 పరుగులకు చేరుకునే సమయానికి ఏడుగురు ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ పెవిలియన్కు చేరుకున్నారు. చివరి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 125 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. కానీ మిడిల్ ఓవర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ల అద్భుతమైన బౌలింగ్తో టీమిండియాను విజయతీరాలకు చేర్చడంలో సక్సెస్ అయ్యారు. వీరిద్దరూ చెరో మూడు వికెట్లు తీయగా, అవేష్ ఖాన్ రెండు వికెట్లు, అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్ తీశారు.
Read Also:West Bengal : బెంగాల్లో తప్పిన భారీ రైలు ప్రమాదం… పట్టాలు తప్పిన మూడు కోచ్లు
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!