Parliament: ఝార్ఖండ్, ప్రత్యేక దేశంపై లోక్సభలో రగడ.. విపక్షాల వాకౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రారంభమైన రెండ్రోజులు సాఫీగా సాగినా శుక్రవారం మాత్రం హాట్ హాట్గా నడిచాయి. బుధవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సభ ప్రారంభమైంది.. గురువారం మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రసంగంతో ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం మాత్రం ఉభయ సభలు ప్రారంభం కాగానే ఇండియా కూటమి సభ్యులు ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) అరెస్ట్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో ఉభయ సభలు గందరగోళం చోటుచేసుకుంది.
రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ.. బీహార్లో నితీష్కుమార్ (Nitish Kumar) రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారని.. ఝార్ఖండ్లో కూటమికి సంపూర్ణ మద్దతు ఉన్న కూడా ప్రమాణస్వీకారానికి మాత్రం ఆలస్యం చేశారని ఆరోపించారు. బీజేపీ జోక్యంతోనే ఝార్ఖండ్లో హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
Also Read
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
ఖర్గే వ్యాఖ్యలను కేంద్రమంత్రి పీయూస్ గోయల్ ఖండించారు. ఝార్ఖండ్లో జరిగిన భూకుంభకోణం కారణంగానే హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారని.. ఆ కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన వ్యక్తిని కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందా? అని కేంద్రమంత్రి నిలదీశారు. ఇదే అంశంపై లోక్సభలోనూ రచ్చ నడిచింది. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఇదిలా ఉంటే మధ్యంతర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని.. ఇలాగైతే సౌతిండియాను ప్రత్యేక దేశంగా చేయాలంటూ డిమాండ్ చేయాల్సి వస్తోందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ (DK Suresh) గురువారం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కూడా ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. సోనియాగాంధీ (Sonia Gandhi) క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రులు పీయూస్ గోయల్, ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పందిస్తూ.. ప్రత్యేక దేశ డిమాండ్ను కాంగ్రెస్ అంగీకరించబోదని తేల్చిచెప్పారు. డీకే సురేష్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.
తాజావార్తలు
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
-
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!