INDA Vs SLA: టీమిండియా ఘన విజయం.. ట్రోఫీ కైవసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక వేదికగా జరిగిన ట్రై-నేషన్ ఎ సిరీస్ ఫైనల్ సమరంలో భారత్ ఎ జట్టు ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక ఎ జట్టుపై భారత్ ఎ జట్టు 66 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
సూర్యవంశీ ప్రపంచ రికార్డు విధ్వంసం..
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఎ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా 15 ఏళ్ల బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 39 పరుగులు చేయగా, మొదటి వికెట్కు వీరిద్దరూ కేవలం 9 ఓవర్లలోనే 132 పరుగులు జోడించారు.
Also Read
భారత్ భారీ స్కోరు..
ఓపెనర్లు అవుటైన తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ (67 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్ (40 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా 36 పరుగులు చేయగా, ఆఖర్లో అనుకుల్ రాయ్ కేవలం 15 బంతుల్లో 4 సిక్సర్లతో 39 పరుగులు, విప్రాజ్ నిగమ్ 27 పరుగులు చేసి మెరుపులు మెరిపించారు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఎ జట్టు 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది.
శ్రీలంక పోరాటం వృథా..
378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఎ జట్టును భారత బౌలర్లు క్రమశిక్షణతో కట్టడి చేశారు. లంక జట్టులో వనుజ సహన్ (62 పరుగులు), సదీర సమరవిక్రమ (52 పరుగులు) అర్ధశతకాలతో ఒంటరి పోరాటం చేశారు. విజయకాంత్ వియాస్కాంత్ 39 పరుగులు, కెప్టెన్ సహన్ అరాచ్చిగే 38 పరుగులు చేసినప్పటికీ లాభం లేకపోయింది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక ఎ జట్టు 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరఫున విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, అనుకుల్ రాయ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!