INDA Vs SLA: టీమిండియా ఘన విజయం.. ట్రోఫీ కైవసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక వేదికగా జరిగిన ట్రై-నేషన్ ఎ సిరీస్ ఫైనల్ సమరంలో భారత్ ఎ జట్టు ఘనవిజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక ఎ జట్టుపై భారత్ ఎ జట్టు 66 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
సూర్యవంశీ ప్రపంచ రికార్డు విధ్వంసం..
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఎ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా 15 ఏళ్ల బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 39 పరుగులు చేయగా, మొదటి వికెట్కు వీరిద్దరూ కేవలం 9 ఓవర్లలోనే 132 పరుగులు జోడించారు.
Also Read
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
- అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
భారత్ భారీ స్కోరు..
ఓపెనర్లు అవుటైన తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ (67 పరుగులు), రుతురాజ్ గైక్వాడ్ (40 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా 36 పరుగులు చేయగా, ఆఖర్లో అనుకుల్ రాయ్ కేవలం 15 బంతుల్లో 4 సిక్సర్లతో 39 పరుగులు, విప్రాజ్ నిగమ్ 27 పరుగులు చేసి మెరుపులు మెరిపించారు. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఎ జట్టు 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది.
శ్రీలంక పోరాటం వృథా..
378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఎ జట్టును భారత బౌలర్లు క్రమశిక్షణతో కట్టడి చేశారు. లంక జట్టులో వనుజ సహన్ (62 పరుగులు), సదీర సమరవిక్రమ (52 పరుగులు) అర్ధశతకాలతో ఒంటరి పోరాటం చేశారు. విజయకాంత్ వియాస్కాంత్ 39 పరుగులు, కెప్టెన్ సహన్ అరాచ్చిగే 38 పరుగులు చేసినప్పటికీ లాభం లేకపోయింది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక ఎ జట్టు 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరఫున విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, అనుకుల్ రాయ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!