IND W vs SL W: చివర్లో తడబడ్డ టీమిండియా.. విక్టరీ సాధించిన శ్రీలంక.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND W vs SL W: కోలంబోలోని ఆర్.పి.ఎస్ మైదానంలో నేడు జరిగిన శ్రీలంక మహిళల వన్డే ట్రై సిరీస్లో భారత్పై శ్రీలంక మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 275 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించి మ్యాచ్ను గెలుచుకుంది.
Read Also: Riyan Parag: వరుసగా ఆరు సిక్స్లు బాదిన రియాన్ పరాగ్.. వీడియో వైరల్!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఇక భారత మహిళల జట్టు బ్యాటింగ్లో రిచా ఘోష్ (58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (37), ప్రతికా రావల్ (35), హర్మన్ప్రీత్ కౌర్ (30) రాణించడంతో మంచి స్కోరు నమోదు చేశారు. చివరి వరుసలో కాష్వీ గౌతమ్ (17), స్నేహ రాణా (10) పరుగులతో రాణించారు. దీనితో మొత్తం 50 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. ఇక శ్రీలంక బౌలింగ్లో చమారి అథపత్తు, సుగందికా కుమారి చెరో 3 వికెట్లు తీసి భారత్ను కట్టడి చేశారు. విహంగా, ఇనోకా రణవీర ఒక్కొక్క వికెట్ తీశారు.
Read Also: Murshidabad riots: బెంగాల్ ముర్షిదాబాద్ అల్లర్లపై గవర్నర్ సంచలన రిపోర్ట్.. ఉగ్రవాదంపై హెచ్చరిక..
ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు ఓపెనర్లు ఆరంభాన్ని నెమ్మదిగా మొదలు పెట్టిన, మిడిల్ ఆర్డర్ లో హర్షితా సమరవిక్రమ (53), కవిషా దిల్హారి (35), కెప్టెన్ అథపత్తు (23) మంచి ఆటతీరు కనబరిచారు. కానీ, మ్యాచ్ లో నిలక్షికా సిల్వా కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 56 పరుగులు చేసి టీమ్కు విజయాన్ని అందించింది. దీనితో ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ లభించింది. చివర్లో అనుష్కా సంజీవని (23 నాటౌట్), సుగందికా కుమారి (19 నాటౌట్) గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక భారత బౌలింగ్ పరంగా చూస్తే.. స్నేహ రాణా 3 కీలక వికెట్లు తీసింది. అలాగే ప్రతికా రావల్, శ్రీ చరణి ఒక్కొక్క వికెట్ తీశారు. ఈ విజయంతో శ్రీలంక మహిళల జట్టు ట్రై సిరీస్లో కీలకమైన మ్యాచ్లో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!