Shivam Dube: ఆ ఇద్దరు వెనకుండి నడిపించారు: దూబె
- 8 మ్యాచుల్లో 133 పరుగులు
- 16 బంతుల్లోనే 27 పరుగులు
- ఫైనల్ మ్యాచ్ అత్యంత కఠిన సవాల్
- ఆ ఇద్దరు వెనకుండి నడిపించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivam Dube Ract on his performance in T20 World Cup 2024: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు చాలా మద్దతు ఇచ్చారని టీమిండియా యువ ఆటగాడు శివమ్ దూబె తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ప్రతి మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, జట్టులోని సహచరులు అండగా నిలిచారన్నాడు. టీ20 ప్రపంచకప్ భారత జట్టు గెలవడంతో తన పాత్ర ఉండటం ఎంతో గర్వంగా ఫీలవుతున్నా అని దూబె చెప్పుకొచ్చాడు. పొట్టి టోర్నీలో దూబె 8 మ్యాచుల్లో 133 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో కీలక సమయంలో 16 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివమ్ దూబె మాట్లాడుతూ… ‘టీ20 ప్రపంచకప్ ప్రయాణం చాలా బాగుంది. ఫైనల్ మ్యాచ్ అత్యంత కఠిన సవాల్ అని చెప్పాలి. జట్టు విజయంలో నా పాత్ర ఉండటం గర్వంగా ఫీలవుతున్నా. మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకున్నా. సహచరులు అండగా నిలిచారు. అభిమానులు నిరంతరం ఉత్తేజపరిచారు. ఫైనల్ మ్యాచ్లో జట్టు కోసం నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించే అవకాశం దక్కింది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నించా. టోర్నీ ఆరంభంలో మాత్రం కాస్త ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలిచారు. నా బలమేంటో చెప్పారు. వారి మద్దతు వల్లే రాణించగలిగా. నిరంతరం నా వెనకుండి నడిపించారు. నాపై వారికున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆడా. భవిష్యత్తులోనూ జట్టు విజయాల్లో నా పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నా’ అని తెలిపాడు.
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత జింబాబ్వేతో టీ20 సిరీస్లో శివమ్ దూబె ఆడాడు. చివరి మ్యాచ్లో 12 బంతుల్లో 26 పరుగులు చేశాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక జులై 27 నుంచి ఆరంభం అయ్యే శ్రీలంకతో సిరీస్లో అతడికి చోటు ఖాయం. నేడు బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది. ఈ సిరీస్లో కూడా రాణిస్తే.. భారత టీ20 జట్టులో సుస్థిర స్థానం అవుతుంది. ఇప్పటికే రోహిత్, కోహ్లీ, జడేజాలు వీడ్కోలు పలికిన నేపథ్యంలో యువకులకు అవకాశాలు దక్కనున్నాయి.
తాజావార్తలు
-
CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..