Gen Z Reality : 23 ఏళ్లకే పచ్చి తాగుబోతులుగా మారుతున్న యువత..!
- Gen Zలో మితిమీరిన మద్యం అలవాటు పెరుగుతోంది
- యువతలో డ్రగ్స్ వినియోగం వేగంగా పెరుగుతుంది
- వేపింగ్ , ఇతర కొత్త వ్యసనాలు
- జూదం, వ్యసనాల ప్రభావం పై హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి తరం యువత (Gen Z) గురించి సమాజంలో ఒక సానుకూల అభిప్రాయం ఉండేది. వారు పాత తరాల కంటే చాలా స్పృహతో ఉంటారని, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారని, వ్యసనాలకు దూరంగా ఉంటారని చాలా మంది భావించేవారు. అందుకే వారిని ‘జనరేషన్ సెన్సిబుల్’ అని కూడా పిలిచేవారు. అయితే, ఇప్పుడు వస్తున్న కొత్త పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి. బ్రిటన్లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్కు చెందిన సెంటర్ ఫర్ లాంగిట్యుడినల్ స్టడీస్ నిర్వహించిన ఒక భారీ అధ్యయనం, యువత ప్రవర్తనలో కనిపిస్తున్న ఆందోళనకరమైన మార్పులను ప్రపంచం ముందుకు తెచ్చింది.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ఈ పరిశోధనలో భాగంగా 2000 నుంచి 2002 మధ్య జన్మించిన సుమారు 10,000 మంది యువతను దాదాపు ఆరేళ్ల పాటు గమనించారు. వారు 17 ఏళ్ల టీనేజ్ దశలో ఉన్నప్పుడు వారి అలవాట్లు ఎలా ఉన్నాయి, 23 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టేసరికి అవి ఎలా మారాయో నిపుణులు విశ్లేషించారు. ఇందులో ప్రధానంగా ‘బెంజ్ డ్రింకింగ్’ (మితిమీరిన మధ్యపానం) అనే అలవాటు యువతలో వేగంగా పెరుగుతున్నట్లు తేలింది. 17 ఏళ్ల వయసులో 53 శాతంగా ఉన్న ఈ అలవాటు, 23 ఏళ్లకు వచ్చేసరికి ఏకంగా 68 శాతానికి పెరిగింది. అంటే మెజారిటీ యువత ఏడాదిలో కనీసం ఒక్కసారైనా నియంత్రణ కోల్పోయేలా మద్యం సేవించామని అంగీకరించారు.
మద్యం మాత్రమే కాకుండా, డ్రగ్స్ వినియోగం కూడా ఈ తరంలో భయంకరంగా పెరుగుతోంది. 17 ఏళ్ల వయసులో 31 శాతంగా ఉన్న గంజాయి వినియోగం, కేవలం ఆరేళ్ల వ్యవధిలో 49 శాతానికి చేరుకుంది. దీనికంటే మించి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, కొకైన్ , కెటమైన్ వంటి అత్యంత ప్రమాదకరమైన హార్డ్ డ్రగ్స్ వాడే వారి సంఖ్య 10 శాతం నుండి 32 శాతానికి పెరిగింది. మరోవైపు వేపింగ్ (ఇ-సిగరెట్లు) సంస్కృతి కూడా యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. 17 ఏళ్లప్పుడు కేవలం 3 శాతంగా ఉన్న వేపింగ్ అలవాటు, 23 ఏళ్ల నాటికి 19 శాతానికి పెరిగింది.
High Protein Soya Chilla Recipe: మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్.. సోయా చిల్లా రెసిపీ సింపుల్గా ఇలా..
వ్యసనాల జాబితాలో ‘గాంబ్లింగ్’ (జూదం) కూడా ప్రధానంగా నిలిచింది. 23 ఏళ్ల వయసులో సుమారు 32 శాతం మంది యువత కనీసం ఒక్కసారైనా జూదం ఆడినట్లు తెలిసింది. ముఖ్యంగా మహిళలతో పోలిస్తే పురుషులలో ఈ జూద వ్యసనం 7 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. మెదడు అభివృద్ధి అనేది సాధారణంగా 25 ఏళ్ల వయసు (మిడ్ 20స్) వరకు జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా ఇదే వయసులో యువత ఇలాంటి తీవ్రమైన వ్యసనాలకు లోనవ్వడం వల్ల వారి మెదడు ఆరోగ్యం , భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రయోగాల పేరుతో చేస్తున్న ఈ పనులు చివరకు వారి జీవితాలనే అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!