KL Rahul: ఆటను ఆస్వాదించండి.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి: భారత్ కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul Says Sanju Samson Played Really Well Today: ఆటను ఆస్వాదించండి, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించండని తాను యువ క్రికెటర్లకు చెప్పానని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ లోకేష్ రాహుల్ చెప్పాడు. ప్రస్తుత జట్టులో కొందరికి అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం లేకపోయినా.. వందశాతం తమ ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నించారన్నాడు. ఐపీఎల్లో సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు అని రాహుల్ పేర్కొన్నాడు. గురువారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను రాహుల్ సేన 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం లోకేష్ రాహుల్ మాట్లాడుతూ… ‘కుర్రాళ్లతో కలిసి ఆడటం ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టా. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలవడం ఆనందంగా ఉంది. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లతో ఐపీఎల్లో చాలా మ్యాచ్లు ఆడాను. యువ క్రికెటర్లకు ఒకేటే చెపుతున్నా.. మీ ఆటను ఆస్వాదించండి. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించండి. మిగతా వాటి గురించి ఆందోళన చెందొద్దు. వన్డే సిరీస్ సందర్భంగా జట్టులో వారి పాత్రను గుర్తు చేశాను’ అని తెలిపాడు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
Also Read: Coal Mine Accident: బొగ్గు గనిలో పెను ప్రమాదం.. 12 మంది మృతి!
‘ప్రస్తుత జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. కొందరికి అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం లేకపోయినా.. వందశాతం ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నించారు. ఐపీఎల్లో సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. కానీ జాతీయ జట్టుకు వచ్చేసరికి.. కొన్ని కారణాల వల్ల టాప్ ఆర్డర్లో ఎక్కువగా అవకాశాలు దక్కడం లేదు. ఈరోజు తన సత్తా ఏంటో చూపించాడు. మంచి షాట్లు ఆడుతూ పరుగులు చేశాడు. ఇలాంటి ఇన్నింగ్స్ సంజూ నుంచి ఆశించాం’ అని లోకేష్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఈ వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (108; 114 బంతుల్లో 6×4, 3×6) సెంచరీ బాదాడు. ఆపై 97 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!