IND vs PAK: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain may disrupt India vs Pakistan Asia Cup 2023 match on Sep 2: ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. బుధవారం ముల్తాన్ వేదికగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. నేడు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మెగా మ్యాచ్ శనివారం (సెప్టెంబర్ 2) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ జరగడం కష్టమే అని సమాచారం తెలుస్తోంది.
సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని సమచారం. శనివారం కాండీలో వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో తేమ 84 శాతం ఉంటుందని పేర్కొంది. దీంతో ఆసియా కప్ 2023లో అత్యంత ఆసక్తికర పోరు వరుణుడి ఖాతాలోకి చేరుతుందా? అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. చూడాలి మరి వరుణుడు ఏం చేస్తాడో.
Also Read
- Hero Bikes Offers: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా.? ఆ బైక్లపై భారీ డిస్కౌంట్.!
- Benjamin Netanyahu: అమెరికా ఒప్పందం చేసుకున్నా తగ్గేదేలే.. ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్..
- FIFA World Cup 2026: ఉత్కంఠభరిత పోరులో ఈజిప్ట్ పొరపాటు.. ఊపిరి పీల్చుకున్న బెల్జియం.! 1-1తో మ్యాచ్ డ్రా..
- US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
సెప్టెంబర్ 2న జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్కి మాత్రమే కాదు.. దాదాపుగా క్యాండీలో జరిగే అన్ని మ్యాచ్లకి వర్షం ముప్పు ఉందట. ఈ రోజు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్కి 86 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయట. సెప్టెంబర్ 4న భారత్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్కి వర్షం ముప్పు 76 శాతం ఉందని తెలుస్తోంది. వర్షం కారణంగా ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. దాంతో ఆసియా కప్ 2023లో ఆడే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! ఏకంగా 60 వేలు
ఆసియా కప్ 2023లో పాల్గొనేందుకు భారత జట్టు బుధవారం శ్రీలంకలో అడుగుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా.. పేసర్ మహ్మద్ షమీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా జట్టంతా ప్రత్యేక బస్సులో విమానాశ్రయం నుంచి హోటల్కు చేరుకుంది. సెప్టెంబరు 2న పాకిస్థాన్ మ్యాచ్తో భారత్ తన ఆసియా కప్ 2023 పోరాటాన్ని ఆరంభిస్తుంది.
తాజావార్తలు
-
Suriya50 : క్రేజీ కాంబో లోడింగ్… ‘జైలర్’ డైరెక్టర్ తో సూర్య కామెడీ డ్రామా
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
PEDDI Percentage Issue : పెద్ది పర్సెంటేజ్.. నాకు తెలియదన్న నిర్మాత.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఛాంబర్
-
Hero Bikes Offers: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా.? ఆ బైక్లపై భారీ డిస్కౌంట్.!
-
Nagarjuna Birthday Special : ఎవర్ గ్రీన్ క్లాసిక్ రొమాంటిక్ మూవీ రీరిలీజ్ తో కింగ్ బర్త్ డే ట్రీట్ రెడీ
ట్రెండింగ్
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!