IND vs PAK: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే! కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain may disrupt India vs Pakistan Asia Cup 2023 match on Sep 2: ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. బుధవారం ముల్తాన్ వేదికగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. నేడు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మెగా మ్యాచ్ శనివారం (సెప్టెంబర్ 2) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ జరగడం కష్టమే అని సమాచారం తెలుస్తోంది.
సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని సమచారం. శనివారం కాండీలో వర్షం పడేందుకు 90 శాతం అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో తేమ 84 శాతం ఉంటుందని పేర్కొంది. దీంతో ఆసియా కప్ 2023లో అత్యంత ఆసక్తికర పోరు వరుణుడి ఖాతాలోకి చేరుతుందా? అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది. చూడాలి మరి వరుణుడు ఏం చేస్తాడో.
Also Read
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
సెప్టెంబర్ 2న జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్కి మాత్రమే కాదు.. దాదాపుగా క్యాండీలో జరిగే అన్ని మ్యాచ్లకి వర్షం ముప్పు ఉందట. ఈ రోజు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్కి 86 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయట. సెప్టెంబర్ 4న భారత్, నేపాల్ మధ్య జరిగే మ్యాచ్కి వర్షం ముప్పు 76 శాతం ఉందని తెలుస్తోంది. వర్షం కారణంగా ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. దాంతో ఆసియా కప్ 2023లో ఆడే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! ఏకంగా 60 వేలు
ఆసియా కప్ 2023లో పాల్గొనేందుకు భారత జట్టు బుధవారం శ్రీలంకలో అడుగుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా.. పేసర్ మహ్మద్ షమీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా జట్టంతా ప్రత్యేక బస్సులో విమానాశ్రయం నుంచి హోటల్కు చేరుకుంది. సెప్టెంబరు 2న పాకిస్థాన్ మ్యాచ్తో భారత్ తన ఆసియా కప్ 2023 పోరాటాన్ని ఆరంభిస్తుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!