Rohit Sharma: 365 రోజుల్లో.. 2-3 చెత్త నిర్ణయాలుంటే పర్లేదు: రోహిత్
- కెప్టెన్గా అది నా నిర్ణయమే
- 2-3 చెత్త నిర్ణయాలుంటే పర్లేదు
- రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma About India 46 All Out: న్యూజిలాండ్తో తొలి టెస్టులో మొదట బ్యాటింగ్ చేయాలన్నది కెప్టెన్గా తన నిర్ణయమే అని రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్ స్వభావాన్ని తాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని చెప్పాడు. 365 రోజుల్లో 2 లేదా 3 చెత్త నిర్ణయాలుంటే పర్లేదనుకుంటా అని పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించాల్సి ఉందని హిట్మ్యాన్ చెప్పుకొచ్చాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 46 పరుగులకే కుప్పకూలింది. ఇందుకు కెప్టెన్ రోహిత్ కారణమంటూ అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.
రెండోరోజు ఆట ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ… ‘ముందుగా బ్యాటింగ్ చేయాలన్నది కెప్టెన్గా నా నిర్ణయమే. స్కోరు చూస్తే బాధ కలుగుతోంది. పిచ్ను అర్థం చేసుకోలేకపోయాను. అందుకే ఈ పరిస్థితిలో ఉన్నాం. అయినా 365 రోజుల్లో 2-3 చెత్త నిర్ణయాలుంటే పర్లేదనుకుంటా. మైదానంలో ఎదురైన సవాలుకు మేం ధీటుగా స్పందించలేకపోయాం. ఈ రోజు మాది కాదు. పిచ్పై ఎక్కువగా పచ్చిక లేదు. తొలి రెండు సెషన్ల తర్వాత స్పిన్కు అనుకూలిస్తుందని భావించాం. భారత్లో ఎప్పుడు ఆడినా తొలి సెషన్ తర్వాత పిచ్ కుదురుకుని.. స్పిన్నర్లకు సహకరిస్తుంది. ఈ పిచ్ మందకొడిగా ఉందనుకుని కుల్దీప్ను తీసుకున్నాం’ అని చెప్పాడు.
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
Also Read: PKL 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్.. తొలి పోరులో బుల్స్తో టైటాన్స్ ఢీ!
‘విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడే బాధ్యతనుతీసుకున్నాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ స్థానాలను మార్చాలనుకోలేదు. సాధారణంగా 4, 5, 6 స్థానాల్లో ఆడే సర్ఫరాజ్ ఖాన్ను నాలుగో స్థానంలో ఆడించాం. పరిస్థితులను కివీస్ పేసర్లకు బాగా ఉపయోగించుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించాల్సి ఉంది. పంత్ మోకాలికి బంతి నేరుగా తాకింది. ఆ మోకాలికి గతంలో శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు మరలా తాకడంతో కాస్త వాపు వచ్చింది. ముందు జాగ్రత్తగా అతడిని బయటికి పంపాం. మూడో రోజు పంత్ మైదానంలో దిగుతాడని ఆశిస్తున్నా. మాకు ఇంకా 3 రోజులు ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి’ అన్ని హిట్మ్యాన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!