IND vs GER: సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమి.. కాంస్యం కోసం భారత్ పోరు!
- కీలక సమరంలో భారత్ తడబాటు
- జర్మనీ చేతిలో 2-3తో ఓటమి
- స్పెయిన్తో కాంస్యం పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Spain Fight for Bronze in Paris Olypics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఎన్నో ఆశలు రేపిన భారత పురుషుల హాకీ జట్టు కీలక సమరంలో మాత్రం తడబడింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో జర్మనీ చేతిలో 2-3తో ఓడిపోయింది. సూపర్ ఫామ్తో సెమీస్ చేరిన హర్మన్ప్రీత్ సేన.. కీలక పోరులో తీవ్రంగా శ్రమించినప్పటికీ విజయతీరాలకు చేరుకోలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ పోరులో జర్మనీని ఓడించి భారత్ కాంస్యం నెగ్గగా.. ఈ విజయంతో ఆ జట్టు ప్రతీకారం తీర్చుకుంది.
Also Read: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే.. వినేశ్ ఫొగాట్ టార్గెట్ గోల్డ్!
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
సెమీస్ మ్యాచ్ను భారత్ ధాటిగా ఆరంభించినా అదే జోరును కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా చివరి క్వార్టర్లో భారత ప్లేయర్స్ తేలిపోయారు. దాంతో మూల్యం చెల్లించుకోక తప్పలేదు. భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (7వ), సుఖ్జీత్ (36వ) చెరో గోల్ కొట్టారు. జర్మనీ తరఫున గొంజాలో (18వ), క్రిస్టొఫర్ (27వ), మార్కో (54వ) గోల్స్ చేశారు. భారత్ చివరిసారి 1980లో ఒలింపిక్స్లో ఫైనల్ ఆడింది. మరో సెమీఫైనల్లో నెదర్లాండ్స్ 4-0తో స్పెయిన్ను ఓడించింది. ఇక భారత్ కాంస్య పతకం కోసం ఆగష్టు 8న స్పెయిన్తో తలపడుతుంది. కాంస్య పతకం అయినా గెలవాలని భారత్ ఫాన్స్ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!